మత్తుమందు ఇచ్చి 5వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, స్కూల్ ప్యూన్ అరెస్ట్
ఓ స్కూల్ లో 5వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో అజయ్ అనే ప్యూన్ను అరెస్టు చేశామని, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 54 ఏళ్ల ప్యూన్తో పాటు అతని ముగ్గురు సహచరులు ఆమెకు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. అజయ్ అనే ప్యూన్ను అరెస్టు చేశామని, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు.
ఘజియాబాద్లో నివసించే ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్కు చెందిన అజయ్ గత పదేళ్లుగా ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో ప్యూన్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) నగర పోలీసులకు, ఎంసీడీకి నోటీసులు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన మార్చి 14 న జరిగింది. సంఘటన జరిగినప్పటి నుండి, బాలిక పాఠశాలకు వెళ్లడం మానేసింది. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు.
దీనిమీద సత్వర చర్యలు తీసుకోనందుకు, వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయనందుకు పాఠశాల ప్రిన్సిపాల్కు, క్లాస్ టీచర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎమ్ సిడీ ఒక ప్రకటనలో తెలిపింది. బాధిత బాలిక ఫైనల్ ఎగ్జామ్స్ కు రాకపోవడంతో.. ఆమె క్లాస్ టీచర్ బాలిక సోదరుడిని ఎందుకు రాలేదని ఆరా తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు టీచర్కు తెలిపాడని పోలీసులు తెలిపారు.
పోలీసుల బూట్ల కింద నలిగి 4 రోజుల నవజాత శిశువు మృతి.. దర్యాప్తుకు ఆదేశించిన ముఖ్యమంత్రి..
ఫిర్యాదు మేరకు నిందితుడు బాలికను పాఠశాల నుంచి గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి ఏదో తెలియని మత్తుమందు ఇచ్చి తన సహచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఘాజీపూర్ పాఠశాల ప్రిన్సిపాల్తో పాటు తన తోటి ఉపాధ్యాయులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) అమృత గుగులోత్ తెలిపారు.
బాధితురాలిని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో, షహదార మండలానికి చెందిన 5వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపుల సంఘటన మార్చి 14న జరిగిందని ఎంసీడీ పేర్కొంది.
"వార్షిక పరీక్షకు హాజరుకాకపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి క్లాస్ టీచర్ ఆమె తల్లికి అడిగింది. మొదట్లో, బాలికలూజ్ మోషన్స్ తో, కడుపునొప్పితో బాధపడుతుందని ఆమె తల్లి చెప్పింది. కానీ తరువాత ఆమె అసలు విషయం చెప్పింది. స్కూల్ అటెండెంట్ తనపై లైంగిక వేధింపుల గురించి క్లాస్ టీచర్ కు చెప్పింది" అని ఎంసీడీ తెలిపింది.
నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు పాఠశాలకు రావాలని పాఠశాల ప్రిన్సిపాల్ బాలిక తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించారని, అయితే వారు పాఠశాలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదని పేర్కొంది. "తర్వాత, ప్రిన్సిపాల్ సంఘటన గురించి జోనల్ అధికారులకు తెలియజేశారు. సంఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఒక మహిళా ఇన్స్పెక్టర్తో సహా ఇద్దరు స్కూల్ ఇన్స్పెక్టర్లతో కూడిన కమిటీ ఈ విషయంపై విచారణ చేసి నివేదికను సమర్పించింది.
కనుగొన్న వివరాల ఆధారంగా కమిటీ, పాఠశాల అటెండెంట్ అజయ్ కుమార్ను తక్షణమే సస్పెండ్ చేశారు" అని ఎంసీడీ తెలిపింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 363 (కిడ్నాప్), 328 (విషం ద్వారా గాయపరచడం మొదలైనవి, నేరం చేయాలనే ఉద్దేశ్యంతో), 376డి (గ్యాంగ్రేప్), 506 (నేరపూరిత బెదిరింపు) సంబంధిత సెక్షన్ల కింద గాజీపూర్ పోలీస్ స్టేషన్లో లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులకు డీసీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. ఎంసీడీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి పాఠశాల ప్యూన్. ఇది చాలా తీవ్రమైన విషయం. నేను ఢిల్లీ పోలీసులకు ఎంసీడీకి నోటీసు జారీ చేస్తున్నాను. కఠిన చర్యలు తీసుకోవాలి. స్కూల్లో కూడా ఆడపిల్లకి భద్రత లేకపోతే ఆమె ఎక్కడికి వెడుతుంది?" అని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ హిందీలో ట్వీట్ చేశారు.