బోర్డర్ టెన్షన్ నడుస్తున్న టైంలో తమిళనాడుకు చెందిన రెండో క్లాస్ పిల్లాడు ఎంతో గొప్పగా ఆలోచించాడు. అతడిలా ప్రతి ఇండియన్ ఆలోచిస్తే భారత్ ను పాకిస్థాన్ కాదుకదా అమెరికా కూడా ఏం పీకలేదు,
India Pakistan : పహల్గాంలో టెర్రరిస్టుల దాడిలో 26 మంది ఇండియన్ టూరిస్టులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్న 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద దాడి చేసింది. ఈ ఆపరేషప్ సిందూర్ లో చాలా మంది టెర్రరిస్టులు చనిపోయారు. దీంతో ఇండియా-పాకిస్తాన్ బోర్డర్లో టెన్షన్ మొదలైంది. రెండు వైపులా డ్రోన్ దాడులు జరిగాయి. ఇండియా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టం పాక్ డ్రోన్లని గాల్లోనే కూల్చేసింది. ఈ టెన్షన్ టైంలో దేశ ప్రజలంతా ఆర్మీకి సపోర్ట్గా నిలబడ్డారు.
10 నెలల సేవింగ్స్ ని ఆర్మీకి ఇచ్చిన చిన్నోడు
ఈ టైంలో ఇండియన్ ఆర్మీకి సాయం చేయడానికి చాలా మంది సెలబ్రిటీలు డబ్బులు ఇచ్చారు. అలాగే తమిళనాడులోని కరూర్లో రెండో క్లాస్ చదివే ఒక చిన్నోడు తన 10 నెలల సేవింగ్స్ అంతా ఆర్మీకి ఇచ్చేసాడు. కొన్ని రోజుల క్రితం కరూర్ కలెక్టర్ ఆఫీస్లో జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ మీటింగ్లో సతీష్ కుమార్ - పవిత్ర దంపతుల కొడుకు తన్విష్ తన పిగ్గీ బ్యాంక్ డబ్బులని కలెక్టర్ తంగవేల్ గారికి ఇచ్చాడు.
దీన్ని చూసిన కలెక్టర్ తంగవేల్ చిన్నోడిని మెచ్చుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన చిన్నోడు, తన పేరెంట్స్, రిలేటివ్స్ ఇచ్చిన డబ్బుల్ని 10 నెలలుగా పొదుపు చేస్తున్నానని, బోర్డర్లో టెన్షన్ నడుస్తున్న టైంలో ఆ డబ్బుల్ని ఆర్మీ వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నానని చెప్పాడు. చిన్నోడి సెల్ఫ్లెస్ సర్వీస్ ని, దాతృత్వాన్ని అందరూ మెచ్చుకున్నారు.