దేశంలో కోవిడ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ రాకతో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కోవిడ్ రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచేందుకు ఛత్తీస్గఢ్ సర్కారు (chhattisgarh govt) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా సంక్షోభం మధ్య మద్యాన్ని ఆన్లైన్లో డెలివరీ (liquor online delivery) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
దేశంలో కోవిడ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ రాకతో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కోవిడ్ రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచేందుకు ఛత్తీస్గఢ్ సర్కారు (chhattisgarh govt) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా సంక్షోభం మధ్య మద్యాన్ని ఆన్లైన్లో డెలివరీ (liquor online delivery) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కట్టడి చేయడంలో భాగంగా మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛత్తీస్గడ్ ప్రభుత్వం తెలిపింది.
అయితే ఆఫ్లైన్లో మద్యం విక్రయాలు యధావిథిగా కొనసాగుతాయని చెప్పింది. రాజధాని రాయ్పూర్లోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా లిక్కర్ ఆన్లైన్ అమ్మకపు సదుపాయాన్ని ప్రారంభించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే మద్యం షాపులను శానిటైజ్ చేస్తున్నట్లు కవాసీ చెప్పారు
మరోవైపు దేశంలో ఒక్క రోజులోనే ఏకంగా దాదాపు లక్షన్నర మంది కరోనా బారినపడ్డారు. Covid-19 మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ భయం ప్రజలు మరింతగా ఆందోళనకు గురిచేస్తున్నతి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. ఇది ఏడు నెలల గరిష్టం. కేవలం ఎనిమిది రోజుల్లోనే Covid-19 మహమ్మారి ఏడు నెలల రికార్డును బ్రేక్ చేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత రోజువారి Coronavirus కేసులు మళ్లీ లక్ష మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి.
కేవలం తొమ్మిది రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష మార్క్ దాటి.. లక్షన్నరకు చేరువైంది. అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా బారినపడ్డవారి సంఖ్య 3,53,68,372కు చేరింది. యాక్టివ్ కేసులు సైతం గణనీయంగా పెరిగాయి. ఏకంగా నాలుగు లక్షలకు పైగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 4,72,169 క్రియాశీల కేసులు ఉన్నాయి.
ఇదే సమయంలో కరోనా నుంచి 40,895 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి Covid-19 నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 3,44,12,740 కి చేరింది. కొత్తగా నమోదైన Coronavirus కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 40,925 కరోనా కేసులు అక్కడ నమోదయ్యాయి. అలాగే, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 68,34,222 కరోనా కేసులు, 1,41,614 మరణాలు నమోదయ్యాయి.
