Asianet News TeluguAsianet News Telugu

ఇండియా: ది మోడీ కొశ్చన్.. ఆ బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం!

2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ మన దేశంలో స్క్రీనింగ్ కాకుండా నిషేధం విధించారు. కానీ, ఈ డాక్యుమెంటరీ వీడియోలను ట్విట్టర్, యూట్యూబ్‌లలో షేర్ చేశారు. వీటిని బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
 

centre blocks twitter, youtube posts of bbc documentary which is critical of pm narendra modi
Author
First Published Jan 21, 2023, 5:46 PM IST

న్యూఢిల్లీ: బ్రిటీష్‌కు చెందిన బీబీసీ గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లపై ఓ డాక్యుమెంటరీ తీసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న సంగతి విధితమే. ఈ డాక్యుమెంటరీ నరేంద్ర మోడీ పాత్రనూ ప్రతికూలంగా తీర్చిదిద్దినట్టు ఆరోపణలు వచ్చాయి. బీబీసీ తీసిన ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం విమర్శించింది. అదొక దుష్ప్రచార డాక్యుమెంటరీ అని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ కొట్టివేసిన సంగతి తెలిసిందే. భారత దేశంలో ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ పై నిషేధం విధించింది.

తాజాగా, ఆ డాక్యుమెంటరీ లింక్‌ను షేర్ చేసిన ట్విట్టర్, యూట్యూబ్ పోస్టులను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందుకే ఇండియా: ది మోడీ కొశ్చన్ అనే బీబీసీ డాక్యుమెంటరీని షేర్ చేసిన ట్వీట్లు, వీడియో షేరింగ్ వెబ్‌సైట్ పోస్టులు అందుబాటులో లేకుండా పోయాయి.

బీబీసీ తీసిన ఈ డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్‌ పోస్టులను బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్‌లను ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌క్యాస్టింగ్ మినిస్ట్రీ ఆదేశించినట్టు కొన్ని వర్గాలు వివరించాయి. ఈ డాక్యుమెంటరీ షేర్ చేస్తూ చేసిన 50 ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించినట్టు తెలిపాయి. 

Also Read: గుజరాత్ అల్లర్లపై తీసిన బీబీసీ డాక్యుమెంటరీ ఒక ప్రాపగాండ.. పీఎం మోడీపై బురదజల్లే యత్నం: కేంద్రం

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దెరెక్ ఓబ్రియన్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఈ డాక్యుమెంటరీని షేర్ చేశారు. వారి ట్వీట్లను తొలగించినట్టు తెలిసింది. దీనిపై ఓబ్రియన్ స్పందించారు కూడా. ‘సెన్సార్షిప్. నా బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్‌ ను ట్విట్టర్ తొలగించింది. తన ట్వీట్‌కు లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రధానమంత్రి మైనార్టీలను ఎలా ద్వేషిస్తారో ఆ ఒక్క గంట డాక్యుమెంటరీ స్పష్ట పరుస్తుంది’ అని పేర్కొన్నారు.

ఐటీ రూల్స్ 2021 పరిధిలోని ఎమర్జెన్సీ పవర్‌లకు లోబడి ఐఅండ్ బీ మినిస్ట్రీ చేసిన ఆదేశాలను యూట్యూబ్, ట్విట్టర్ అంగీకరించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios