రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్ పేరు మార్చిన కేంద్రం.. ఇకపై అది ‘‘అమృత్ ఉద్యాన్’’
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వున్న మొఘల్ గార్డెన్స్ పేరు మార్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి అమృత్ ఉద్యాన్గా పేరు పెట్టారు. ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అమృత్ ఉద్యాన్ను ప్రారంభించనున్నారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వున్న మొఘల్ గార్డెన్స్ పేరు మార్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి అమృత్ ఉద్యాన్గా పేరు పెట్టారు. జనవరి 31 నుంచి అమృత్ ఉద్యాన్ను ప్రజలను అనుమతించనున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ‘‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ’’ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొఘల్ గార్డెన్స్ పేరు మార్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అమృత్ ఉద్యాన్ను ప్రారంభించనున్నారు.