Bipin Rawat last speech: సీడీఎస్ బిపిన్ రావత్ చివరి సందేశం విడుదల.. ఏం మాట్లాడారంటే..?
Bipin Rawat last speech: 1971లో జరిగిన పాకిస్థాన్ - భారత్ మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఆ విజయానికి గుర్తుగా 'స్వర్ణిమ్ విజయ్ పర్వ్' వేడుకలను దిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివంగత తొలి సీడీఎస్ చివరి వీడియో రికార్డును ప్రసారం చేశారు.
ఆ వీడియోను డిసెంబర్ 7న రికార్డు చేసినట్టు భారత సైన్యం తెలిపింది.
Bipin Rawat last speech: భారత తొలి సర్వసైన్యాధ్యక్షుడు (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మరణ వార్త నుంచి దేశం ఇంకా కోలుక్కొలేదు. డిసెంబర్ 8 న తమిళనాడు నీలగిరి పర్వతశ్రేణుల్లోని కూనుర్ పాంత్రంలో జరిగిన ప్రమాదంలో రావత్ దంపతులతో పాటు మరో 11 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. సీడీఎస్ మరణవార్తతో యవత్తు దేశం విషాదం లోని వెళ్లింది. ఈ సమయంలో ఆయన గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్న ప్రజానీకం మరింత తల్లడిల్లిపోతోంది. వీరుడా సెలవంటూ భారతావాని కన్నీటి వీడ్కోలు పలికింది. యావత్ ప్రజానీకం రావత్కు నివాళి అర్పించింది.
కాగా.. ఆయన మరణానికి కొద్ది గంటల ముందు రికార్డు చేసిన ఓ వీడియోను సీడీఎస్ బిపిన్ రావత్ చిట్ట చివరి సందేశమంటూ.. ఇండియన్ ఆర్మీ ఆదివారం నాడు విడుదల చేసింది. స్వర్ణిమ్ విజయ్ పర్వ్ అనే కార్యక్రమంలో జనరల్ బిపిన్ రావత్ చివరి వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు. ఈ వీడియోను డిసెంబరు 7న రికార్డు చేసినట్టు అధికారులు తెలిపారు.
ఇంతకీ ఏం మాట్లాడంటే..
స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా.. భారత దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను నేను అభినందిస్తున్నాను. 1971 ఇండియా-పాక్ యుద్ధంలో భారత్ విజయం సాధించి.. 50 యేండ్లు పూర్తయింది. ఆ మరణ వీరుల త్యాగాలకు గుర్తుగా 'స్వర్ణిమ్ విజయ్ పర్వ్' జరుపుకుంటున్నాము. ఈ ప్రత్యేక సందర్భంలో, నేను ధైర్యవంతులను స్మరించుకుంటాను. వారి త్యాగాలకు నా నివాళులర్పిస్తాను..’అంటూ తన చిట్టచివరి సందేశంలో సీడీఎస్ రావత్ పేర్కొన్నారు.
తూర్పు పాకిస్థాన్ స్వతంత్ర పోరాటం వల్ల 1971లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్దంలో పాకిస్థాన్ ను భారత్ ఓడించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ యుద్దంలో విజయం సాధించడంతో దానికి గుర్తుగా ప్రతి యేటా డిసెంబరు 16న విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు. ఆ యుద్దానికి 50 యేండ్లు పూర్తయిన సందర్భంగా 'స్వర్ణ విజయ సంవత్సరం'గా పేర్కొంటూ ఏడాది పాటు దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈ కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. 1971 ఇండియా-పాక్ యుద్ధ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయాలని భావించినా.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అకాల మరణంతో నిరాడంబరంగా జరుపుతున్నట్లు రాజ్నాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రావత్ భారత సైన్యానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
1971 ఇండో-పాక్ యుద్ధంతో దక్షిణాసియా చరిత్ర, భౌగోళిక స్థితి మారిందనీ, ఆ యుద్ధంలో అమరులైన ప్రతి సైనికుడి ధైర్యానికి, పరాక్రమానికి, త్యాగానికి నమస్కరిస్తున్నని అన్నారు. ఆ దైర్యవంతుల త్యాగానికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని, ఈ యుద్ధంతో భారత దేశ నైతికత, ప్రజాస్వామ్య సంప్రదాయాలు
ప్రపంచ దేశాలు తెలిశాయని అన్నారు. గడిచిన 50 ఏళ్లలో బంగ్లాదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందిందనీ, ఇప్పుడూ ఆ దేశం మిగిలిన ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అన్నారు.