Asianet News TeluguAsianet News Telugu

విమాన ప్రయాణికుడికి బుల్లెట్ గాయాలు.. నేల మీది నుంచి కాల్పులు జరిపిన దుండగులు.. ఎక్కడంటే?

మయన్మార్‌లో ఓ విమానప్రయాణికుడికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. భూమి పై నుంచి జరిపిన కాల్పుల్లో వెలువడిన బుల్లెట్ విమాన గోడలను చీల్చుకుని లోపలికి వెళ్లింది.
 

bullet injury to flight passenger, which shot from the ground
Author
First Published Oct 2, 2022, 4:54 PM IST

న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి బుల్లెట్ గాయాలు అవుతాయని ఎవరైనా ఊహించగలరా? అదీ నేల పై నుంచి కాల్పులు జరిపితే.. విమాన ప్రయాణికుడు గాయపడటం అరుదుల్లోకెల్లా అరుదు. కానీ, ఈ ఘటన ప్రస్తుత మిలిటరీ అధీనంలోని మయన్మార్‌లో చోటుచేసుకుంది. 

మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని భూమి పై నుంచి వచ్చిన ఓ బుల్లెట్ గాయపరిచింది. విమాన బాడీని చీల్చుకుని ఆ బుల్లెట్ లోనికి చొరబడి ఆ ప్రయాణికుడిని గాయపరిచింది. దీంతో వెంటనే ఆ విమానాన్ని మయన్మార్‌లోని లోయ్‌కావ్‌లో నేల దింపారు. బ్రిటీష్ ఏజెన్సీ ది సన్ ప్రకారం, ఆ ఘటన జరిగినప్పుడు విమానం దాదాపు 3,500 అడుగుల ఎత్తులో ఉన్నది. ఎయిర్‌పోర్టుకు ఉత్తరాన నాలుగు మైళ్ల దూరాన ఉన్నది.

ఈ ఘటన జరిగిన వెంటనే లొయ్‌కావ్‌ మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ ఆఫీసు కీలక ప్రకటన చేసింది. తమ సిటీ అన్ని నిరవధికంగా విమానాలను రద్దు చేసినట్టు వివరించింది. కాయా రాష్ట్రంలోని తిరుగుబాటు శక్తులే ఈ ఈ ఘటనకు పాల్పడ్డాయని మిలిటరీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను రెబెల్ ఫోర్సెస్ తిరస్కరించాయి.

కరెన్ని నేషనల్ ప్రొగ్రెసివ్ పార్టీకి చెందిన ఉగ్రవాదులే ఈ కాల్పులకు పాల్పడ్డారని మిలిటరీ కౌన్సింగ్ ప్రతినిధి, మేజర్ జనరల్ జావ్ మిన్ తున్ తెలిపారు. ప్యాసింజర్ ఫ్లైట్‌పై ఇలాంటి కాల్పులకు తెగబడటం యుద్ధ నేరం అని ఆయన అధికార టీవీ చానెల్ ఎంఆర్‌టీవీకి చెప్పారు. శాంతి కావాలని కోరుకునే ప్రజలు, సంఘాలు ఈ ఘటనను ఖండించాలని వివరించారు.

కాయాలో కొంతకాలంగా మిలిటరీకి, స్థానిక తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చేసి ఆర్మీ 2021లో అధికారాన్ని చేపట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios