కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి కేసులను బీజేపీ ఏకరువు పెట్టింది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ఫైల్స్ అని ఓ ఎపిసోడ్‌ను వీడియో రూపంలో ట్వీట్ చేసింది.  

న్యూఢిల్లీ: బీజేపీ ఈ రోజు కాంగ్రెస్ పై అవినీతి ఆరోపణలు తీవ్రం చేసింది. ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాంగ్రెస్ ఫైల్స్ అంటూ ఓ వీడియో సిరీస్‌ను ట్వీట్ చేసింది. యూపీఏ హయాంలో విచ్చలవిడి అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఆ వీడియో ఉన్నది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ కాంగ్రెస్ ఫైల్స్ ఫస్ట్ ఎపిసోడ్‌ను పోస్టు చేసింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో 2జీ స్కామ్, కోల్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ అవినీతి ఆరోపణలను ఆ వీడియోలో ఏకరువు పెట్టారు.

మూడు నిమిషాల ఈ వీడియో క్లిప్‌లో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కనిపించారు. యూపీఏ హయాంలో రూ. 48,20,69,00,00,000 విలువైన స్కామ్‌లు జరిగాయని ఆ వీడియోలో ఆరోపించారు.

Scroll to load tweet…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతవారం ప్రతిపక్షాల పై విరుచుకపడుతూ భ్రష్టాచారీ బచావో ఆందోళన్‌ను ప్రారంభించాయని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ప్రధాని మోడీ టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే భ్రష్టాచారి బచావో అభియాన్‌ను కొన్ని పార్టీలు ప్రారంభించాయని వివరించారు.

Also Read: Karnataka Election 2023: కర్ణాటకలో మోడీపైనే బీజేపీ ఆశలు.. కనీసం 20 మోడీ సభలు.. ఆ సవాళ్లను అధిగమించగలడా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ప్రధానంగా తీవ్ర అవినీతి ఆరోపణల సవాల్‌ను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా.. కర్ణాటకలో ఢీ అంటే ఢీ అని బీజేపీతో తలపడుతున్న కాంగ్రెస్ హయాంలోని అవినీతి కేసులను ఏకరువు పెట్టడం గమనార్హం. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.