ఎన్నికల ముందు బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు మాజీ మంత్రులు
Bhopal: ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఇద్దరు మాజీ మంత్రులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. త్వరలోనే మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగున్నాయి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగున్నాయి. ఇలాంటి తరుణంలో పలువురు నేతలు పార్టీని వీడితుండటంపై బీజేపీలో కలవరం మొదలైందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Madhya Pradesh BJP: ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఇద్దరు మాజీ మంత్రులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. త్వరలోనే మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగున్నాయి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగున్నాయి. ఇలాంటి తరుణంలో పలువురు నేతలు పార్టీని వీడితుండటంపై బీజేపీలో కలవరం మొదలైందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
వివరాల్లోకెళ్తే.. ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి షాక్ ఇస్తూ ఓ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బుధవారం పార్టీని వీడారు. బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్ కాంగ్రెస్ లో చేరగా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మమతా మీనా పార్టీకి రాజీనామా చేశారు. అయితే తన రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రం ఆమె బహిరంగంగా చెప్పలేదు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ ఎదుట ఆయన తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాలాఘాట్ నుంచి బీజేపీ టికెట్ ఆశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, గత నెలలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ బిసేన్ కు చోటు కల్పించడంతో బాలాఘాట్ నుండి బీజేపీ టికెట్ లభిస్తుందనే ఆశను కోల్పోయారు.
15 నెలల కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయిన తరువాత 2020లో మార్చిలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మాజీ మంత్రి బిసేన్ కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం నిరాకరించారు. దీంతో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కదనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లో నెలకొంది. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రస్తుత పదవీకాలం ముగియడంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తారనే ఆశలను పునరుజ్జీవింపజేసింది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని చాచోడా అసెంబ్లీ స్థానానికి పార్టీ టికెట్ నిరాకరించడంపై మమతా మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఈ స్థానం నుంచి ప్రియాంక మీనాను బీజేపీ బరిలోకి దింపింది.
రెండు నెలల క్రితం విడుదల చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో చోటు దక్కించుకున్న 39 మంది అభ్యర్థుల్లో ఆమె ఒకరు. మరోవైపు ప్రస్తుతం ముఖ్యమంత్రి చౌహాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న బుధ్నికి చెందిన బీజేపీ నేత రాజేష్ పటేల్ కూడా బుధవారం కాంగ్రెస్ లో చేరారు. అయితే ఈ పరిణామంపై తాను ఏమీ చెప్పలేనని చౌహాన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ నిరాకరించబడుతుందని భావించి పార్టీలోని టికెట్ ఆశావహులు బీజేపీని వీడారని ఆ పార్టీ అధికార ప్రతినిధి భగవాన్ దాస్ సబ్నానీ చెప్పారు. ఎన్నికల సమయంలో నాయకులు పార్టీలు మారడం సాధారణ విషయమేనని మరో బీజేపీ నేత వ్యాఖ్యానించారు.