Asianet News TeluguAsianet News Telugu

140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అవమానించడమే..: జైరామ్ రమేష్ కామెంట్స్‌పై నడ్డా ఫైర్

పాత పార్లమెంట్‌తో పోలిస్తే కొత్త పార్లమెంటు భవనం రూపకల్పనలో చాలా లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ విమర్శించారు. అయితే జైరామ్ రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP chief JP Nadda hits back Jairam Ramesh after he calls new parliament a Modi multiplex ksm
Author
First Published Sep 23, 2023, 12:14 PM IST

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కొత్త పార్లమెంట్ భవనం వేదికగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే పాత పార్లమెంట్‌తో పోలిస్తే కొత్త పార్లమెంటు భవనం రూపకల్పనలో చాలా లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ విమర్శించారు. పాత పార్లమెంట్‌తో పోల్చితే కొత్త పార్లమెంట్‌లో సభ్యుల మధ్య చర్చలు, చర్చలకు చోటు లేదని, ఉద్యోగులకు పని చేసేందుకు సౌకర్యాలు అందడం లేదని ఆరోపణలు చేశారు. ఈ మేరకు జైరామ్ రమేష్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 2024లో అధికారం మారిన తర్వాత కొత్త పార్లమెంట్ భవనాన్ని మరింత సద్వినియోగం చేసుకునేందుకు మార్గం దొరుకుతుందని కూడా అన్నారు. 

అయితే జైరామ్ రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. జైరామ్ రమేష్, కాంగ్రెస్ తీరుపై ఆయన మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీ యొక్క అత్యల్ప ప్రమాణాల ప్రకారం కూడా.. ఇది దయనీయమైన ఆలోచన. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అవమానించడమే తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనప్పటికీ,..కాంగ్రెస్ పార్లమెంటును వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదు. వారు 1975లో ప్రయత్నించారు. అది ఘోరంగా విఫలమైంది’’ అని  జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. 

మరోవైపు బీజేపీ ఎంపీ శాండిల్య గిరిరాజ్ సింగ్ కూడా జైరామ్ రమేష్‌పై విరుచుకుపడ్డారు. ‘‘భారతదేశంలోని వంశపారంపర్య గుహలను విశ్లేషించాలని, హేతుబద్ధీకరించబడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ముందుగా 1 సఫ్దర్‌జంగ్ రోడ్ ప్రాంగణాన్ని వెంటనే భారత ప్రభుత్వానికి అప్పగించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రులందరికీ పీఎం మ్యూజియంలో చోటు ఉంది’’ అని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. 

 

జైరామ్ రమేష్ విమర్శలు ఇవే.. 
‘‘కొత్త పార్లమెంటు భవనాన్ని గొప్ప ప్రచారంతో ప్రారంభించిన విధానం.. ప్రధాని మోడీ లక్ష్యాన్ని సాకారం చేసింది. కొత్త పార్లమెంటును వాస్తవానికి మోదీ మల్టీ కాంప్లెక్స్ లేదా 'మోడీ మారియట్ అని పిలవాలి. 4 రోజుల ప్రొసీడింగ్స్ తర్వాత పార్లమెంట్‌లో ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి స్థలం లేదని నేను చూశాను. పార్లమెంటు ఉభయ సభల్లోనూ, ఆవరణలోనూ ఇదే పరిస్థితి.

ఆర్కిటెక్చర్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తే, అలిఖిత రాజ్యాంగాన్ని నాశనం చేయడంలో ప్రధాని మోదీ విజయం సాధించారు. కొత్త పార్లమెంట్‌లో కూర్చున్న సభ్యులు ఒకరినొకరు చూసుకోవడానికి బైనాక్యులర్‌లు అవసరం.. ఎందుకంటే హాలు అస్సలు సౌకర్యవంతంగా లేదా కాంపాక్ట్‌గా లేదు. పాత పార్లమెంట్‌లో సభ్యుల మధ్య కమ్యూనికేషన్ సౌకర్యం కూడా ఉంది. ఉభయ సభలు, సెంట్రల్ హాల్ లేదా పార్లమెంటు కారిడార్‌లలో తిరగడం కూడా చాలా సులభం. పాత భవనంలో మీరు తప్పిపోయినట్లయితే.. అది వృత్తాకారంలో ఉన్నందున మీరు తిరిగి మీ దారిని కనుగొంటారు. కొత్త భవనంలో, మీరు మీ మార్గం కోల్పోతే మీరు చిట్టడవిలో ఉన్నట్టే.పాత భవనం మీకు స్థలం, నిష్కాపట్యతను అందించింది. అయితే కొత్తది దాదాపు క్లాస్ట్రోఫోబిక్‌గా ఉంది. 

 

పార్టీ శ్రేణులకు అతీతంగా నా సహచర ఎంపీలు చాలా మంది అలాగే భావిస్తున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పార్లమెంట్ సిబ్బంది నుంచి కొత్త భవనం రూపకల్పనలో వారి పని చేయడానికి అవసరమైన వివిధ కార్యాచరణలను పరిగణనలోకి తీసుకోలేదని నేను విన్నాను. భవనాన్ని ఉపయోగించే వ్యక్తులతో ఎటువంటి సంప్రదింపులు జరగనప్పుడు ఇది జరుగుతుంది. 2024లో పాలన మారిన తర్వాత కొత్త పార్లమెంట్ భవనానికి మంచి ఉపయోగం లభించవచ్చు’’ అని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios