రాజ్ఠాక్రే బర్త్డే: లీటర్ పెట్రోల్పై రూ. 9 తగ్గింపు
ముంబై వాసులకు బంపర్ ఆఫరిచ్చిన రాజ్ ఠాక్రే
ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబై వాసులకు రాజ్ ఠాక్రే బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. గురువారం నాడు ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో రూ. 9 తక్కువధరకే ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ ను విక్రయిస్తున్నారు.
మహారాష్ట్రలోని 48 పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధరను రూ.9 తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన తరుణంలో ప్రజలకు నవ నిర్మాణ సేన ఈ ఆఫర్ ను ప్రకటించింది.
ముంబైలో 36 పెట్రోల్ స్టేషన్లలో, ఇతర ప్రాంతాల్లో 12 చోట్ల ఈ అవకాశం కల్పించింది. అయితే, ఈ తగ్గింపు కేవలం ద్విచక్ర వాహనదారులకే పరిమితం చేసింది. లీటర్ కు రూ. 9 తగ్గించి వాహనదారులకు పెట్రోల్ విక్రయాలు జరపడం వల్ల ఈ రోజు ఒక్కో బంక్ కు వచ్చే నష్టాన్ని నవ నిర్మాణ సేన చెల్లించనుంది.