Rahul Gandhi: భారత్ జోడో యాత్ర లక్ష్యం భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమేననీ, 2024 సార్వత్రిక ఎన్నికలు కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగనుంది.
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర లక్ష్యం 2024 సార్వత్రిక ఎన్నికలు కాదనీ, దేశ ప్రజలను ఏకం చేయడమేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్లు ‘హింస, ద్వేషాన్ని’ వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన కర్నాటకలో మీడియాతో మాట్లాడుతూ.. తనని అవాస్తవంగా, తప్పుగా ప్రచారం చేయడానికి వేల కోట్లు వెచ్చించిందనీ, జాగ్రత్తగా చూసే ప్రజలే నిజం ఏమిటో చూస్తారని అన్నారు. అలాగే, తాను తపస్యను నమ్ముతాననీ, ప్రజల బాధలు, ఇబ్బందులు వారి మాటల్లోనే పంచుకుంటున్నాననీ అన్నారు. కాగా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా సమస్యలను ఎత్తిచూపడంతో పాటు గత వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను చేపట్టింది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుంది. 3,570 కిలోమీటర్లు.. 150 రోజుల సుదీర్ఘ దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభం అయింది.
నివేదికల ప్రకారం భారత్ జోడో యాత్ర కర్ణాటక గుండా 21 రోజుల పాటు రాష్ట్రంలో 511 కిలో మీటర్లు కొనసాగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభమై యాత్ర తమిళనాడు, కేరళ మీదుగా శుక్రవారం కర్ణాటకలోకి ప్రవేశించింది. శనివారం నాడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే భారత్ జోడో యాత్ర లక్ష్యం తప్ప 2024 లోక్సభ ఎన్నికలు కాదని ఆయన అన్నారు. "నేను పేర్కొన్న లక్ష్యం భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే. నా దృష్టికోణం నుండి లక్ష్యం 2024 ఎన్నికలు కాదు.. భారతదేశం విభజించబడుతుందనీ, మన సమాజంలో హింస వ్యాప్తి చెందుతుందని.. ఇది మన దేశానికి హాని కలిగిస్తుందని నేను చూస్తున్నాను" అని మాజీ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు.
అలాగే, ప్రధానమైన మూడు ప్రాథమిక సమస్యలను సైతం లేవనేత్తే లక్ష్యంతో యాత్ర సాగుతున్నదనే విషయాన్ని ఆయన పేర్కొన్నాఉ. అందులో బీజేపీ-ఆరెస్సెస్ లు దేశంలో హింస, ద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయి. విభజన కు పాల్పడుతున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే.. నిరుద్యోగానికి దారితీసే విధంగా సంపద భారీ కేంద్రీకరణ అనుమతించబడుతోంది. దేశంలో నిత్యావసరాలు సహా ఇతర వాటి ధరలు నిరంతరంగా పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాను ఎల్లప్పుడూ కొన్ని ఆలోచనలపై నిలబడతాననీ, అయితే, ఇదే విషయం బీజేపీ, ఆరెస్సెస్ లను కలవరానికి గురిచేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. డుతుందని అన్నారు.
వేలాది కోట్ల రూపాలతో, మీడియా శక్తితో నన్ను అవాస్తవంగా, తప్పుగా చిత్రీకరించడానికి ప్రయత్నం జరిగింది. అది ఇంకా కొనసాగుతున్నది. అయితే, నిజాన్ని ప్రజలు ఎప్పటికైనా గ్రహిస్తారు: రాహుల్ గాంధీ
అలాగే, తన భారత్ జోడో యాత్రలో ఒక రాజకీయ అంశం ఉందని పేర్కొంటూ.. రాజకీయ వ్యవస్థలో రాజకీయ వర్గానికి మన పౌరులకు మధ్య ఉన్న దూరాన్ని తాను చూస్తున్నాననీ, ప్రజల వద్దకు మరింత దగ్గరగా వెళ్లాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఇది కారులో లేదా విమానంలో వెళ్లడానికి లేదా మీడియా ద్వారా విలేకరుల సమావేశంలో చేరుకోవడానికి చాలా భిన్నంగా ఉందని ఆయన అన్నారు. "నా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, వారి బాధలను పంచుకోవచ్చని నేను అనుకున్నాను. అది చాలా శక్తివంతమైన అనుభవంగా నేను భావిస్తున్నాను.. ఈ యాత్రలో ప్రజలకు మరింత దగ్గరగా వెళ్లాను" అని గాంధీ చెప్పారు. ఇటీవల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్రం నిషేధం విధించడంపై ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో విద్వేషాలను వ్యాప్తి చేసే వ్యక్తి ఎవరు, ఏ వర్గానికి చెందిన వారన్నది ముఖ్యం కాదని అన్నారు.
