Bengaluru: బెంగళూరులో ఒక తాగుబోతు త‌న‌ భార్య, ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి చంపాడు. కేన్సర్ బారిన పడిన భర్త.. ఆ త‌ర్వాత త‌న‌ మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా,  ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Alcoholic man poisons wife, two daughters: క‌ర్నాట‌క‌లో ఓ షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక తాగుబోతు త‌న‌ భార్య, ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి చంపాడు. కేన్సర్ బారిన పడిన భర్త.. ఆ త‌ర్వాత త‌న‌ మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివ‌రాల్లోకెళ్తే.. బెంగళూరులోని కోననకుంఠే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లకు ఆహారంలో విషం కలిపి చంపాడు. మృతులను విజయలక్ష్మి (28), నిషా (7), దీక్ష (5)గా గుర్తించారు. కేన్సర్ బారిన పడిన భర్త నాగేంద్ర కూడా మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగేంద్రకు కేన్సర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో అతని భార్య విజయలక్ష్మి ఇంటి నిర్వహణ బాధ్యతను తీసుకుంది. అయితే, కొన్నేళ్లుగా నాగేంద్ర మద్యానికి బానిసయ్యాడు.

నాగేంద్ర తరచూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. బుధవారం కూడా భార్య విజయలక్ష్మితో గొడవ పడ్డాడు. గొడవ అనంతరం ఆహారంలో విషం కలిపి భార్య, ఇద్దరు కూతుళ్లకు వడ్డించగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఉదయం విజయలక్ష్మి సోదరుడు వారి ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

పెళ్లికి నిరాక‌రించింద‌ని.. 

పెళ్లికి నిరాకరించినందుకు ప్రియురాలిని ఓ వ్యక్తి హత్య చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడు తన ప్రేయసిని ఆమె కార్యాలయం వెలుపల సుమారు 15 సార్లు పొడిచాడు. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన పవిత్ర నీలమణిగా గుర్తించారు. బాధితురాలు ఒమేగా హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ ప్ర‌యివేటు లిమిటెడ్ లో పనిచేస్తోందని పోలీసులు తెలిపారు. నిందితుడు హెల్త్ కేర్ సెక్టార్ లో పనిచేస్తున్నాడ‌నీ, పేరు దినకర్ బానాలాగా గుర్తించారు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందినవాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినకర్, లీల గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి సిద్ధమవుతున్నారని తెలిపారు. అయితే కుల విభేదాల కారణంగా లీలా కుటుంబం ఈ పెళ్లిని వ్యతిరేకించింది. అంతా సవ్యంగా సాగినంత వరకు, సంబంధం ముందుకు సాగింది, కాని లీలా వారి వివాహానికి తన కుటుంబం అంగీకరించదని, చివరికి తన కుటుంబ నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉంటుందని దినకర్ కు చెప్పడంతో, ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం జరుగుతుండగా నిందితుడు కత్తి తీసి లీలాపై దాడి చేశాడు. లీలాపై 15 సార్లు కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత లీలా రక్తపు మడుగులో పడిపోయింది. అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే లీల మృతి చెందింది.