Asianet News TeluguAsianet News Telugu

కరోనా రోగి ఇంటికి రేకులతో సీల్: క్షమాపణ చెప్పిన మున్సిపల్ కమిషనర్

కరోనా రోగి ఉన్న కుటుంబం ఇంటి నుండి బయటకు రాకుండా బెంగుళూరు మున్సిపల్ అధికారులు రెండు ప్లాట్లను రేకులతో మూసివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికుడు సతీష్ సంగమేశ్వరన్ ట్వీట్ చేశారు. 

Bengaluru civic body seals two flats with tin sheets, removes after crticism
Author
Bengaluru, First Published Jul 24, 2020, 10:42 AM IST

బెంగుళూరు:కరోనా రోగి ఉన్న కుటుంబం ఇంటి నుండి బయటకు రాకుండా బెంగుళూరు మున్సిపల్ అధికారులు రెండు ప్లాట్లను రేకులతో మూసివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికుడు సతీష్ సంగమేశ్వరన్ ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్ కారణంగానే ఈ విషయం వెలుగు చూసింది. తమ బిల్డిండ్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఈ ఫ్టాట్లలో ఉంటున్నవారిని బయటకు రాకుండా తలుపులకు రేకులతో సీల్ వేశారని ఆయన ఫోన్ లో పోటోలు తీసి మున్సిపల్ అధికారులకు షేర్ చేశాడు.

రెండు ఫ్లాట్లను సీల్ చేసినట్టుగా ఆయన ప్రకటించారు. ఒక ఇంట్లో ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. ఈ ఫ్లాట్ పక్కనే ఉండే మరో ఫ్లాట్ లో వృద్ధ దంపతులు నివసిస్తున్నారని సతీష్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ రెండు ఫ్లాట్లను రేకులతో మూసివేశారని... పొరపాటున అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరును ఆయన ఎండగట్టారు. 

also read:ఒక్క రోజులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 12,87,945కి చేరిక

కరోనా  రోగుల కుటుంబాలకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందం నిత్యావసర సరుకులను అందించడం కూడ కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మున్సిపల్ అధికారుల  తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయమై బెంగుళూరు మున్సిపల్ కమిషనర్ మంజునాథ ప్రసాద్ క్షమాపణ కోరారు. 

తమ సిబ్బంది చేసిన పనికి తాను క్షమాపణ చెప్పుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ రెండు ప్లాట్లకు అడ్డుగా ఉంచిన రేకులను వెంటనే తొలగిస్తామని ఆయన చెప్పారు. కరోనా సోకినవారిని కాపాడడంతో పాటు  ఇతరులకు వైరస్ సోకకుడా కాపాడడమే కంటైన్మెంట్ ఉద్దేశ్యమన్నారు. స్థానిక సిబ్బంది అత్యుత్సాహం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios