Bengaluru: బెంగూళూరులో ఏరో ఇండియా-2023లో పలు దేశాలకు చెందిన అత్యాధుని యుద్ద విమానాలు, వివిధ కంపెనీలు తయారు చేసిన విమానాలు పాలుపంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన రెండు బీ-1బీ రాక్ వెల్ యుద్ధ విమానాలు సైతం ఇందులో పాలుపంచుకోవడంతో మరో సరికొత్త చర్చ మొదలైంది.
Aero India 2023: బెంగూళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2023 షో ఆకట్టుకుంటోంది. పలు దేశాలకు చెందిన అత్యాధుని యుద్ద విమానాలు, వివిధ కంపెనీలు తయారు చేసిన విమానాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన 2బీ-1బీ రాక్ వెల్ యుద్ధ విమానాలు సైతం ఇందులో పాలుపంచుకోవడంతో మరో సరికొత్త చర్చ మొదలైంది. అమెరికా-భారత్ ల మధ్య రక్షణ రంగం ఒప్పందాలు దీనిలో ప్రధాన అంశం ఉంది.
వివరాల్లోకెళ్తే.. బెంగళూరులో జరిగే ఏరో షోలో పాల్గొనేందుకు అమెరికా వైమానిక దళం (యూఎస్ఏఎఫ్) మరోసారి తమ రెండు బీ-1బీ లాన్సర్లను, ఇతర రక్షణ యంత్రాలు, యుద్ధ విమానాలను పంపిందని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియాకు మద్దతుగా అమెరికా మంగళవారం బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో రెండు బీ-1బీ లాన్సర్లను దింపింది. అమెరికా లాంగ్ రేంజ్ బాంబింగ్ సామర్థ్యాలకు వెన్నెముకగా భావించే బి-1 హెవీ బాంబర్ అమెరికాలోని తన సొంత స్థావరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మిషన్లు చేపట్టగలదు. ఇవి అత్యాధునికమైన యుద్ధ విమానాలు. ఐదో తరం యుద్ధవిమానం మల్టీరోల్ స్టెల్త్ ఎఫ్-35 సోమవారం తొలిసారి భారత గడ్డపై ల్యాండ్ అయిన తర్వాత బీ-1 రెండోసారి భారత గడ్డపై కనిపించింది. గత ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా 2021 ఫిబ్రవరి 3 న బి-1 హెవీ బాంబర్ భారతదేశంలో మొట్టమొదటి ల్యాండింగ్ జరిగింది.
మంగళవారం జరిగిన వైమానిక ప్రదర్శనలో బి-1, ఎఫ్-35 యుద్ధ విమానాలు రెండూ తమ శక్తివంతమైన సామర్థ్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అమెరికా వైమానిక దళంలో గైడెడ్, అన్ గైడెడ్ ఆయుధాల అతిపెద్ద సంప్రదాయ పేలోడ్ బి-1ను కలిగి ఉంటుంది.
అత్యాధుని ఈ యుద్ధ విమానాల రాక అమెరిక-భారత్ రక్షణ రంగం భాగస్వామ్యాన్ని ముందుకు సాగే విధానానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి యునైటెడ్ స్టేట్స్ ఇస్తున్న ప్రాముఖ్యతను ఇది నొక్కిచెబుతుంది.
