Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా అధీర్ రంజన్ చౌదరి

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా  అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం నాడు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ  పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
 

Bengal Congress leader Adhir Ranjan Chowdhury to be party chief in Lok Sabha
Author
New Delhi, First Published Jun 18, 2019, 5:40 PM IST

న్యూఢిల్లీ:  లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా  అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం నాడు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ  పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

బెంగాల్ రాష్ట్రం నుండి  ఐదు దఫాలు అధీర్ చౌదరి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో బెంగాల్ పీసీసీ చీఫ్ గా కూడ ఆయన పనిచేశారు.  యూపీఏ 2 లో అధీర్ చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 

గత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా  వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే  ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేరు.  దీంతో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా అధీర్ రంజన్ ను ఎన్నుకొన్నారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios