వైజాగ్ టు సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో నాణ్యత లేని ఆహారం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఆహారం కోసం డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నా.. క్వాలిటీగా ఉండటం లేదని ఓ ప్రయాణికుడు ఆరోపించారు. దీనిని మరో ప్రయాణికుడు వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సరఫరా చేసే ఆహారం నాణ్యత సరిగా లేదంటూ ఓ వ్యక్తి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నెలలో ప్రారంభించిన సికింద్రాబాద్ టు వైజాగ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఇది చోటు చేసుకుంది. ఈ వీడియోను ప్రతాప్ కుమార్ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. 45 సెకండ్ల పాటు ఉన్న ఈ చిన్న క్లిప్లో ఓ ప్రయాణికుడు రైలులో సరఫరా చేసిన వడ నుంచి నూనెను పిండటం కనిపిస్తోంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలులో అందించిన ఆహారంలో నాణ్యత లేదని ఫిర్యాదు చేస్తూ కంటైనర్ లో నేను పిండుతున్నారు. వందే భారత్ రైలులో ఆహార ధరలు అధికంగా ఉన్నాయని, కానీ క్వాలిటీ బాగా లేదని పేర్కొన్నారు. ఈ ప్రతాప్ కుమార్ అనే యూజర్ ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకు ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలులో ఆహార ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, నాణ్యత బాగా లేదు.’’ అని క్యాప్షన్ పెట్టారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో పాటు ట్విట్టర్ యూజర్లలో చర్చకు దారితీసింది. కొంతమంది వినియోగదారులు ఈ ఫిర్యాదుపై విభేదించగా.. మరికొందరు మద్దతుగా నిలిచారు. ‘‘వందే భారత్ రైలులో ఆహార సేవ బాగుంది. ఇక్కడ చూపించినంత చెడ్డగా లేదు.’’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. మరో యూజర్ ఇది ‘‘షాకింగ్’’ అని పేర్కొన్నారు.
కాగా.. ఈ వీడియోపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) స్పందించింది. ఇలాంటివి జరకుండా సంబంధింత అధికారికి సమాచారం అందించామని ట్వీట్ చేసింది.