;ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో అయోధ్య రామమందిర ప్రతిరూపాన్ని ఏర్పాటుచేసారు. కాబట్టి పర్యాటకులు ఇక్కడే బాల రాముడి దర్శనం చేసుకోవచ్చు. 

మహాకుంభ్ నగర్ : ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్ళి అదే యూపీలో వున్న అయోధ్య సందర్శించలేకపోతున్నారా? ఏం బాధపడకండి. ఈసారి విశ్వహిందూ పరిషత్ (VHP) అయోధ్యనే కుంభమేళాకు తీసుకువచ్చింది. సంగమ నగరిలోనే అయోధ్య రామ మందిరం నమూనాను ప్రతిష్టించారు. విహిప్ పండాల్‌లో నల్లరాతితో చేసిన బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు...ఇది భక్తులకు అయోధ్యలో రామ మందిరం చూసిన అనుభూతి కలుగుతోంది.

రామ మందిర ఉద్యమ స్మృతులు

ఇలా కేవలం రామలాల దర్శనానికే కాదు, రామ మందిర ఉద్యమ స్మృతులను పదిలపరచడానికీ విహెచ్పి ఈ ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రత్యేక స్తంభాలపై రామ మందిర ఉద్యమ సంఘటనలను చెక్కారు. ఈ స్తంభం విహిప్ వ్యవస్థాపకుడు అశోక్ సింగల్ స్మృతికి అంకితం.

భక్తుల అనుభవం

మహాకుంభ్‌లో స్నానం చేసిన భక్తులు ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక యాత్రగా భావిస్తున్నారు. ఆ బాలరాముడి దర్శనంతో అయోధ్య వెళ్లినట్లే అనిపిస్తోందని చాలామంది భక్తులు అన్నారు. ఇది ఆధ్యాత్మికంగానే కాదు, చరిత్ర, ధర్మంపై ఆసక్తి ఉన్నవారికీ అద్భుతమైన అనుభవం. రామ మందిర దర్శనంతోపాటు ఐక్యత, సంఘర్షణ, హిందూ సమాజ ఐక్యత సందేశాన్ని ఇస్తోంది. మహాకుంభ్‌కి వచ్చే ప్రతి భక్తుడికీ ఇది మరపురాని అనుభవం.

'హమీఁ తో లగా అయోధ్యా హీ ఆ గయే!' మహాకుంభ్ నగరీ మేఁ భవ్య రామ మందిర్ కీ ఝలక్, VHP కీ దిఖీ అనోఖీ పహల్