Ayodhya Ram Mandir Pran Pratishtha : రామజ్యోతిని వెలిగించిన ప్రధాని నరేంద్ర మోడీ

Ayodhya Ram Mandir Inauguration Live Updates AKP

అయోధ్య : రామ జన్మభూమి అయోధ్యలో నిర్మితమైన భవ్య రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని అతిరధ మహారథులు సమక్షంలో దేశ ప్రజలందరూ భక్తిపారవశ్యంతో వీక్షిస్తుండగా రామమందిరంలో రామయ్యకు ప్రాణప్రతిష్ట చేసారు ప్రధాని.    

7:50 PM IST

మెక్సికోలో ప్రారంభమైన తొలి రామ మందిరం.. పూజారిగా అమెరికన్

అయోధ్యలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్టను పురస్కరించుకుని దేశ విదేశాల్లోని భారతీయులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో మెక్సికోలోని క్వెరెటారో నగరంలో ఎన్ఆర్ఐలు ఆ దేశంలో రామాలయాన్ని నిర్మించారు. భారత్ నుంచి తీసుకొచ్చిన సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి అమెరికన్ జాతీయుడు పూజారిగా వ్యవహరించడం గమనార్హం. 
 

7:34 PM IST

అయోధ్యకు బీజేపీ రైళ్లు.. షెడ్యూల్ ఇదే , తెలంగాణలో ఎంతమందికి ఛాన్స్ అంటే .?

అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట ఘట్టం ముగిసింది. మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో జనవరి 29 నుంచి ఈ ఆస్థా రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అయోధ్యకు భక్తులను పంపనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి ఈ అవకాశం కల్పించనున్నారు.

7:20 PM IST

రామజ్యోతిని వెలిగించిన ప్రధాని నరేంద్ర మోడీ

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రామజ్యోతిని వెలిగించి, దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు

 

7:06 PM IST

అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరంలో మరో రామాలయం

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. అయోధ్యకు దాదాపు 1000 కి.మీ దూరంలో మరో రామాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలోని నయాగఢ్ జిల్లాలోని ఫతేగఢ్‌లో ఈ రామాలయ నిర్మాణం జరిగింది. దీనికి అవసరమైన నిధులన్నీ స్థానికులే సమకూర్చుకున్నారు. 
 

6:17 PM IST

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట : భక్తుడికి గుండెపోటు, ప్రాణాలు నిలబెట్టిన వాయుసేన

అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఓ భక్తుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. రామకృష్ణ శ్రీవాస్తవ అనే భక్తుడికి గుండెపోటు రాగా.. వాయసేనలోని BHISHM క్యూబ్ బృందం వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. గోల్డెన్ అవర్‌లో చికిత్స లభించడంతో శ్రీవాస్తవ ప్రాణం నిలిచింది.  

6:13 PM IST

32 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన ఉమా భారతి, సాధ్వి రితంబర

1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉమా భారతి, సాధ్వి రితంబరలు దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వారిద్దరూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. 
 

5:52 PM IST

సరయూ నదీ తీరంలో దీపోత్సవం

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం దీపోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సరయూ నదీ తీరంలో భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించారు. 
 

5:35 PM IST

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట : అతిథులకు 7 రకాల ప్రసాదాలు

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగిసింది. మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా వేడుక కనులపండుగా జరిగింది. దేశ విదేశాల నుంచి దాదాపు 7000 మంది ప్రముఖులు అయోధ్యకు విచ్చేశారు. వీరందరికి దర్శనం అనంతరం ప్రత్యేక ప్రసాదం అందజేయాలని శ్రీరామ జన్మభూమి తీర్ధ ట్రస్ట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా లక్నోలో 15 వేల స్వీట్ బాక్సులను తయారు చేయించింది. ఇందులో రెండు లడ్డూలు, బెల్లం రేవ్ డీ, రామదాన చిక్కీ, అక్షతలు, కుంకుమ, తులసీదళం, యాలకులతో పాటు రాముడి దీపం ప్రమిద వున్నాయి.

5:23 PM IST

దేశమంతా రామమయం : సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్

అయోధ్య రామ మందిరంలో ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిషాలోని పూరీ తీరంలో రామమందిర నమూనాను తీర్చిదిద్దారు. రామాలయంతో పాటు నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రూపం కనువిందు చేస్తోంది. 

5:15 PM IST

రామ్ లల్లా సేవలో అంబానీ ఫ్యామిలీ

అయోధ్య రామ మందిరం ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖేష్ దంపతులతో పాటు వారి కుమారులు, కోడళ్లు, కూతురు అల్లుడు ఈ కార్యక్రమంలో పాల్గొని రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి అంబానీ ఫ్యామిలీ దిగిన ఫోటో వైరల్ అవుతోంది. 

 

5:05 PM IST

అయోధ్యను రోజుకు ఎంతమంది దర్శించనున్నారో తెలుసా..?

భారతీయుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం సాకారమైంది. రామ్ లల్లా విగ్రహా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వున్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ప్రతిరోజూ 1 నుంచి 1.5 లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శించనున్నారని అంచనా. ఈ మేరకు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ గ్రూప్ పేర్కొంది. దీని ప్రకారం ఏడాదికి 5 కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం వుంది. 

4:59 PM IST

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట : హాజరైన బాలీవుడ్ స్టార్ కపుల్స్

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆలయ నిర్వాహక కమిటీ ఆహ్వానించింది. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రెటీలు అలియా భట్ - రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు. 

4:40 PM IST

రేపటి నుంచి భక్తులకు రామ్ లల్లా దర్శనం

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామ్ లల్లా దర్శనమివ్వనున్నారు. వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా రామ దర్శనం లభించనుంది. తొలి స్లాట్ ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గటల వరకు రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒకరోజు ముందుగానే బుకింగ్ చేసుకోవాలని రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. 

4:29 PM IST

జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

అయోధ్య రామ మందిర ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులు, ఇంజనీర్ల బృందంపై మోడీ పూల వర్షం కురిపించారు. 

4:14 PM IST

అయోధ్యకు రావడం నా అదృష్టం : రాం చరణ్

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అద్భుతమన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది దేశంలోని ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవమన్నారు. తాను అయోధ్యకు రావడం తన అదృష్టమన్నారు .
 

4:02 PM IST

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట .. నా కళ్లలోంచి నీళ్లొచ్చాయి : పవన్ కళ్యాణ్

రామకార్యం అంటే రాజ్య కార్యమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సెల్ఫీ దిగి దానిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇవాళ తాను భావోద్వేగానికి గురయ్యానని, ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయన్నారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింత పెంచిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

 

3:50 PM IST

ఈ భూమ్మీద నా కంటే అదృష్టవంతులు లేరు : రామ్ లల్లా విగ్రహ రూపశిల్పి

రామ్ లల్లా విగ్రహ రూపశిల్పి అరుణ్ యోగిరాజ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్షణం ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని తానేనని ఆయన అన్నారు. తన పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్ లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై వుంటాయని యోగిరాజ్ పేర్కొన్నారు. రామ్ లల్లా విగ్రహాన్ని 51 అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు యోగిరాజ్. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడిపై సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారు. 

3:39 PM IST

జనవరి 22 ఇకపై రామ్ దివాళీ : ముఖేష్ అంబానీ

అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటీ ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన సతీమణి నీతా అంబానీలు అయోధ్యకు చేరుకుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది చారిత్రాత్మక దినమని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. జనవరి 22న ఇకపై రామ్ దివాళీగా జరుపుకుంటారని అన్నారు. 

 

3:33 PM IST

అయోధ్యలో మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్ సెల్పీ

అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటీ ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలో భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, భారత  బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్‌లు అయోధ్య వేదిక వద్ద కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ దిగారు. 

 

3:26 PM IST

అయోధ్య : ఆలయాన్ని నిర్మించిన కార్మికులపై పూలు జల్లిన మోడీ

అయోధ్య ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులు, ఇతర సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో వీరిపై స్వయంగా పూలు జల్లారు మోడీ. 

3:18 PM IST

రామాలయ ప్రారంభోత్సవం.. కొత్త శకానికి ఆరంభం : అశ్వినీ వైష్ణవ్

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం మనమంతా గర్వపడాల్సిన సమయమన్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇది కొత్త శకానికి ఆరంభమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు రామ్ లల్లాకు ప్రధాని మోడీ పూజలు చేస్తున్న వీడియోను ఆయన పంచుకున్నారు. 

2:56 PM IST

దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర్ , ఇదే మన కొత్త నినాదం : మోడీ

దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర్ ఇదే మన కొత్త నినాదమన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఇవాళ దేశంలో నిరాశవాదానికి చోటు లేదని, వున్న బలాన్ని కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలని మోడీ చెప్పారు. పరాక్రమవంతుడైన రాముడిని నిత్యం పూజించాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

2:51 PM IST

న్యాయవ్యవస్ధ మన కల సాకారం చేసింది : మోడీ

రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమని.. ఈ క్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనమని మోడీ చెప్పారు. మనదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలమని.. ఈ క్షణం మన విజయానికే కాదు, వినయానికి కూడా సూచిక అని మోడీ తెలిపారు. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్ధం చేసుకోలేకపోయారని, పవిత్రత, శాంతి , సామరస్యం భారత ఆత్మకు ప్రతిరూపమని ప్రధాని వ్యాఖ్యానించారు. వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానమని మోడీ తెలిపారు. అత్యున్నమైన ఆదర్శ వ్యక్తికి ఇవాళ ప్రాణ ప్రతిష్ట జరిగిందని ప్రధాని పేర్కొన్నారు. రాముడే భారత్ ఆధారం, రాముడే భారత్ విధానమన్నారు. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్టే కాదు, భారత విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ట అన్నారు. రాముడు అగ్ని కాదని, రాముడు వెలుగు అని మోడీ పేర్కొన్నారు. 

2:38 PM IST

రాముడంటే వివాదం కాదు.. రాముడంటే సమాధానం : మోడీ

కలియుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం ఇవాళ దీపావళిని జరుపుకుంటోందని, రాముడు భారతదేశ ఆత్మ అని  ప్రధాని చెప్పారు. రాముడు లోకానికి ఆదర్శమని, అన్ని భాషల్లోనూ రామాయణం విన్నానని ఆయన తెలిపారు. రామమందిరాన్ని న్యాయమైన ప్రక్రియలో నిర్మించామని , ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టానని, అన్ని రాష్ట్రాల్లో వున్న రాముడి ప్రధాన ఆలయాలను దర్శించానని మోడీ చెప్పారు. 500 ఏళ్లుగా రామమందిరం నిర్మాణం ఎందుకు జరగలేదో అందరూ ఆలోచించాలని ప్రధాని పిలుపునిచ్చారు. రాముడంటే వివాదం కాదని, రాముడంటే సమాధానమని మోడీ అభివర్ణించారు. 

2:28 PM IST

రామ్ లల్లా ఇక టెంట్‌లో వుండరు : మోడీ

రామ్ లల్లా ఇక టెంట్‌లో వుండరు, గర్భగుడిలోనే వుంటారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాముడు వచ్చేశాడని, కాలచక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయమని మోడీ పేర్కొన్నారు. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టకు హాజరుకావడం తన అదృష్టమని, ఈ క్షణం ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోందని ప్రధాని తెలిపారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని, ఎక్కడ రాముని కార్యక్రమం జరుగుతుందో.. అక్కడ హనుమంతుడు వుంటాని మోడీ చెప్పారు.

ఎన్నో ఏళ్ల  పోరాటాలు , బలిదానాలు, నిష్ట తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని ప్రధాని తెలిపారు. తన శరీరం ఇంకా అనుభూతిని ఆస్వాదిస్తోందని, ఇది సామాన్యమైన సమయం కాదన్నారు. తన మనస్సంతా బాలరాముడి రూపంపైనే వుందని, రామాయణ కాలంలో 14 ఏళ్ల వనవాసం వుందని మోడీ చెప్పారు. రాముడి కోసం ప్రజలు 14 ఏళ్లు ఎదురుచూశారని, ఈ యుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని ప్రధాని తెలిపారు. 

2:11 PM IST

మోడీ, మోహన్ భాగవత్‌లకు అపురూప కానుకలు

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌లకు యూపీ సీఎం యోగి ఆదత్య నాథ్ కానుకలు అందజేశారు. అయోధ్య ఆలయ ఆకృతిలో వుండే బహుమతులు సమర్పించారు. 

 

2:09 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ఓ తపస్వి... ఆయనవల్లే రామరాజ్యం స్థాపన : ఆర్ఎస్ఎస్ చీఫ్

అయోధ్యలో రామ్ లల్లాతో పాటు సరికొత్త భారత్ ఆవిష్కృతం అయ్యిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. చిన్నచిన్న గ్రామాల్లో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా జోష్ తో పాటు ఆలోచనలు చేయాల్సి  వుందన్నారు. ప్రధాని చాలా కఠోర దీక్ష చేసారు.... ఆయన తపస్వి కాబట్టే చేసారన్నారు, అయోధ్యలోంచి రాముడు ఎందుకు బయటకు వెళ్లారో ఆలోచించాలని అన్నారు. 500 సంవత్సరాల తర్వాత రామయ్య తిరిగి అయోధ్యకు వచ్చారు... ఇది ఆనందదాయకమని అన్నారు.. ప్రధానిలాగే మనం కూడా రామరాజ్య స్థాపనకు కృషిచేయాలని మోహన్ భగవత్ సూచించారు. 

2:00 PM IST

ఎక్కడ రామమందిరం కట్టాలనుకున్నామే అక్కడే కట్టాం.. : యోగి ఆదిత్యనాథ్

500 ఏళ్ళ నిరీక్షణ తర్వాత రామమందిర నిర్మాణం జరిగిందని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం యావత్ దేశం అయోధ్య వైపే చూస్తోందన్నారు. రామనామ స్మరణ వింటుంటే మనం త్రేతాయుగంలో వున్నట్లుగా వుందన్నారు. రామ భక్తుల హృదయంలో సంతోషం వుందన్నారు. ఎక్కడ మందిరం కట్టాలనుకున్నామో అక్కడే కట్టాం... 
భారత ప్రజలు నిరీక్షణ ఈరోజు తీరిందన్నారు. ఈ కల సాకారం చేసిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.అయోధ్య అభివృద్ది శరవేగంగా జరుగుతోందని అన్నారు. ఆ రామయ్య కృపతో అయోధ్య ప్రశాంతంగా వుంటుంది. రామరాజ్య స్థాపన జరుగుతుందని యోగి అన్నారు.  
 

1:45 PM IST

ఉపవాసాన్ని విరమించిన ప్రధాని మోదీ

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ముగియడంతో 11 రోజుల ఉపవాసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముగించారు.  స్వామీజీ ప్రధానికి పాలు తాపి ఉపవాసాన్ని విరమింపజేసారు.

1:34 PM IST

ప్రధాని మోదీకి శాలువాతో సత్కరించిన పండితులు, మందిర వెండి జ్ఞాపిక సత్కారం

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శాలువాతో సత్కరించారు. అనంతరం అయోధ్య రామమందిర వెండి జ్ఞాపికలను యూపీ సీఎం ప్రధాని మోదీ, మోహన్ భగవత్ కు అందించారు. . 
 

1:32 PM IST

ప్రధాని మోదీకి శాలువాతో సత్కరించిన పండితులు

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శాలువాతో సత్కరించారు. 

1:28 PM IST

అయోధ్య ప్రాంగణంలో వేదకపైకి చేరుకున్న ప్రధాని మోదీ

రామమందిర ప్రారంభోత్సవాని విచ్చేసిన అతిథులకు ప్రధాని మోదీ నమస్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపైకి చేరుకున్నారు.  
 

1:24 PM IST

అయోధ్య మందిరాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

అయోద్య రామమందిరంలో బాలరాముడికి తొలి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు ప్రధాని మోదీ. అనంతరం రామయ్యకు తొలి హారతి కూడా ప్రధాని ఇచ్చారు. పూజల తర్వాత ఆలయంలో కలియతిరుగుతూ పరిశీలించారు ప్రధాని మోదీ. 
 

1:16 PM IST

రామయ్యకు ప్రధాని సాష్టాంగ్ నమస్కారం

ప్రధాని మోదీ బాలరాముడి చుట్టే ప్రదక్షిణలు చేసారు. అనంతరం రామయ్య ముందు సాష్టాంగ నమస్కారం చేసారు.

1:13 PM IST

బాలరాముడి పూజా క్రతులు ముగింపు..

 అయోధ్య బాలరాముడికి ప్రధాని మోదీ పూజలు ముగిసాయి. పూజా కార్యక్రమాలు ముగియడంతో ప్రధాని గర్భాలయం నుండి బయటకు వస్తున్నారు.  
 

12:50 PM IST

బాలారాముడికి ప్రధాని మంగళహారతి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడికి హారతి ఇచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రామయ్యకు హారతి ఇచ్చారు. అయోధ్య  బాలరాముడికి ప్రధాని ఫలాలు సమర్పించారు.  

 

12:49 PM IST

బాలరాముడికి ఆర్ఎస్ఎస్ చీఫ్ పూజలు

ప్రధాన మంత్రి మోదీతో పాటు అయోధ్య బాలరాముడికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు నిర్వహించారు. 

12:47 PM IST

అయోధ్య రామయ్య దివ్యమంగళ దర్శనం

అయోధ్య బాలరాముడు ఆభరణాలు ధరించి మరింత సుందరంగా మారారు. ఆ రామయ్య ప్రాణప్రతిష్ట పూజలు అందుకుంటున్నారు. 

12:40 PM IST

అయోధ్య బాలరాముడికి ప్రధాని పూజలు

12:39 PM IST

అయోధ్య రామమందిరంపై పూల వర్షం

అయోధ్య రామమందిరంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అతిథులు మైమరచిపోయారు. 

12:33 PM IST

బాలరాముడి పాదాలను నమస్కరించిన ప్రధాని మోదీ

అయోధ్య బాలరాముడికి ప్రధాని మోదీ పూజ నిర్వహించారు. రామయ్య పాదాలపై పుష్ఫాలు పెట్టి నమస్కరించుకున్నారు. 
 

12:26 PM IST

అయోధ్య గర్భగుడిలో ప్రాణప్రతిష్ట పూజలు

అయోధ్య  బాలరాముడు కొలువైన గర్భగుడిలో  ప్రధాని నరేంద్ర మోదీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాత్రమే పాల్గొన్నారు. 

12:16 PM IST

అయోధ్య ఆలయంలో ప్రధానితో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్

ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్  మోహన్ భగవత్ ఆలయంలో పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


 

12:11 PM IST

రామమందిర ప్రాణప్రతిష్ట పూజలు ప్రారంభం

పూజా సామాగ్రిని ప్రధాని మోదీ  పూజారులకు అందించారు. దీంతో ఆలయ ప్రాణప్రతిష్ట పూజలు ప్రారంభమయ్యాయి.  ప్రధాని మోదీ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గోన్నారు. 


 

12:07 PM IST

అయోధ్య రామమందిరానికి చేరుకున్న ప్రధాని మోదీ

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయి.  ప్రధాని నరేంద్ర మోదీ ఆలయానికి చేరుకున్నారు. 

11:51 AM IST

అయోధ్యలో ల్యాండ్ అయిన బాలీవుడ్ సెలబ్రెటీస్

ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ చాలామంది అయోధ్యకు చేరుకున్నారు. బాలీవుడ్ జంటలు రణ్ బీర్-ఆలియా, విక్కీ కౌశల్-కత్రినా జంట ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. 

11:36 AM IST

అతిథులతో నిండిపోయిన అయోధ్య మందిర ప్రాంగణం

అయోధ్య రామమందిర ప్రాంగణం అతిథులతో నిండిపోయింది. ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో రామమందిరానికి చేరుకోనున్నారు. 

11:26 AM IST

అయోధ్యలో కొనసాాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాంస్కృతిక నృత్యాలు, పాటలతో అతిథులను అలరిస్తున్నారు.

11:23 AM IST

అయోధ్య రామమందిర విహంగ వీక్షణం

అయోధ్య రామమందిరాన్ని ఆకాశం నుండి చూస్తే మరింత అద్భుతంగా కనిపిస్తోంది. ఆలయ విహంగ వీక్షణ వీడియో మీకోసం.  

11:14 AM IST

అయోధ్య రామమందిరానికి మోహన్ భగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం చీఫ్ మోహన్ భగవత్ అయోధ్యకు చేరుకున్నారు. ప్రధాని మోదీతో పాటు ఆయన గర్భగుడిలోకి వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 
 

11:11 AM IST

అయోధ్య రామమందిరానికి బాలీవుడ్ జంటలు

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ దంపతులు హాజరయ్యారు. అలాగే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జోడి కూడా జంటగా అయోధ్యకు విచ్చేసారు. 

11:04 AM IST

అయోధ్యలో పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధినేత, తెలుగు సినీనటులు పవన్ కల్యాణ్ అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసారు.  

10:59 AM IST

కొడుకు అబిషేక్ తో కలిసి అయోధ్యకు అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ తో కలిసి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసారు. 

10:47 AM IST

అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ

రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకకోసం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మరికొద్దిసేపట్లో రామమందిరానికి చేరుకోనున్నారు. 

10:32 AM IST

అయోధ్య రామయ్య ప్రాంగణంలో టిడిపి చీఫ్ చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయోధ్య రామమందిర ప్రాంగణానికి చేరుకున్నారు. అతిథుల కోసం ఏర్పాటుచేసిన గ్యాలరీలో ఆయన ఇతర అతిథులతో పలకరిస్తూ కనిపించారు. 


 

10:25 AM IST

వాటికన్ సిటీ కంటే గొప్పగా అయోధ్య రామమందిరం : కంగనా రనౌత్

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యను చూస్తుంటే పురాతన కాలంలో వున్నట్లు అనిపిస్తోందని అన్నారు.  యోగి ప్రభుత్వంపై కంగనా ప్రశంసలు కురిపించారు. 

 


 

10:17 AM IST

కుటుంబసమేతంగా అయోధ్య రామమందిరానికి చిరంజీవి

చిరంజీవి, సురేఖ దంపతులు అయోధ్య రామమందిరానికి చేరుకున్నారు. వారివెంట తనయుడు రామ్ చరణ్ కూడా వున్నారు. వీరికి కాషాయ కండువా కప్పి స్వాగతం పలికారు నిర్వహకులు. 

10:15 AM IST

అయోధ్య రామమందిరానికి చేరుకున్న క్రీడాకారులు, సినీ తారలు

రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం క్రీడా, సినీ ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులు, అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, హేమామాలిని బాలీవుడ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, సుమన్ వంటి టాలీవుడ్ సినీతారలు అయోధ్య రామమందిరానికి చేరుకున్నారు. 


 

10:06 AM IST

చలి తీవ్రతతో అయోధ్యకు రాలేకపోతున్న అద్వానీ

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు బీజేపీ సీనియర్ నేత అద్వానీ హాజరుకావడం లేదని సమాచారం. అయోధ్యలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన రావట్లేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

9:57 AM IST

అయోధ్యకు చేరుకున్న ధర్మపురి అరవింద్

తెలంగాణ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్  రామమందిర ప్రారంభోత్సవంలోవేడుకల కోసం అయోధ్యకు చేరుకున్నారు. ప్రస్తుతం అయోధ్య భూలోక స్వర్గంగా కనిపిస్తోందని అరవింద్ అన్నారు. 


 

9:53 AM IST

అయోధ్య ఆలయ ప్రాంగణానికి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్

అయోధ్య రామమందిరానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ చేరుకున్నారు. ఆయన ఆలయ ప్రారంభోత్సవాలను స్వయంగా పరిశీలిస్తున్నారు.  

9:47 AM IST

రంగురంగుల పూలతో సుందరంగా ముస్తాబైన అయోధ్య ఆలయం

ప్రారంభోత్సవ వేడుకల కోసం అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ప్రాంగణంలో వేదికను ఏర్పాటుచేసి అతిథులు కూర్చోడానికి కుర్చీలు వేసారు. అలాగే ఆలయాన్ని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు.  

9:28 AM IST

న్యూయార్క్ టైమ్ స్క్వెర్ లో అయోధ్య రామయ్య

అయోధ్య రామయ్య ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో శ్రీరాముడి 3డి ఫోటో ప్రదర్శిస్తున్నారు. 

 

9:24 AM IST

అయోధ్యకు భారీగా చేరుకున్న సాధుసంతులు

అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను కనులారా వీక్షించేందుకు సాధుసంతులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అయోధ్య రామమందిర ప్రాంగణమంతా కాషాయమయం అయ్యింది.  

 

7:50 PM IST:

అయోధ్యలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్టను పురస్కరించుకుని దేశ విదేశాల్లోని భారతీయులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో మెక్సికోలోని క్వెరెటారో నగరంలో ఎన్ఆర్ఐలు ఆ దేశంలో రామాలయాన్ని నిర్మించారు. భారత్ నుంచి తీసుకొచ్చిన సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి అమెరికన్ జాతీయుడు పూజారిగా వ్యవహరించడం గమనార్హం. 
 

7:34 PM IST:

అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట ఘట్టం ముగిసింది. మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో జనవరి 29 నుంచి ఈ ఆస్థా రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అయోధ్యకు భక్తులను పంపనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి ఈ అవకాశం కల్పించనున్నారు.

7:20 PM IST:

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రామజ్యోతిని వెలిగించి, దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు

 

7:06 PM IST:

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. అయోధ్యకు దాదాపు 1000 కి.మీ దూరంలో మరో రామాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలోని నయాగఢ్ జిల్లాలోని ఫతేగఢ్‌లో ఈ రామాలయ నిర్మాణం జరిగింది. దీనికి అవసరమైన నిధులన్నీ స్థానికులే సమకూర్చుకున్నారు. 
 

6:17 PM IST:

అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఓ భక్తుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. రామకృష్ణ శ్రీవాస్తవ అనే భక్తుడికి గుండెపోటు రాగా.. వాయసేనలోని BHISHM క్యూబ్ బృందం వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. గోల్డెన్ అవర్‌లో చికిత్స లభించడంతో శ్రీవాస్తవ ప్రాణం నిలిచింది.  

6:13 PM IST:

1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉమా భారతి, సాధ్వి రితంబరలు దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వారిద్దరూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. 
 

5:52 PM IST:

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం దీపోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సరయూ నదీ తీరంలో భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించారు. 
 

5:34 PM IST:

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగిసింది. మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా వేడుక కనులపండుగా జరిగింది. దేశ విదేశాల నుంచి దాదాపు 7000 మంది ప్రముఖులు అయోధ్యకు విచ్చేశారు. వీరందరికి దర్శనం అనంతరం ప్రత్యేక ప్రసాదం అందజేయాలని శ్రీరామ జన్మభూమి తీర్ధ ట్రస్ట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా లక్నోలో 15 వేల స్వీట్ బాక్సులను తయారు చేయించింది. ఇందులో రెండు లడ్డూలు, బెల్లం రేవ్ డీ, రామదాన చిక్కీ, అక్షతలు, కుంకుమ, తులసీదళం, యాలకులతో పాటు రాముడి దీపం ప్రమిద వున్నాయి.

5:23 PM IST:

అయోధ్య రామ మందిరంలో ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిషాలోని పూరీ తీరంలో రామమందిర నమూనాను తీర్చిదిద్దారు. రామాలయంతో పాటు నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రూపం కనువిందు చేస్తోంది. 

5:15 PM IST:

అయోధ్య రామ మందిరం ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖేష్ దంపతులతో పాటు వారి కుమారులు, కోడళ్లు, కూతురు అల్లుడు ఈ కార్యక్రమంలో పాల్గొని రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి అంబానీ ఫ్యామిలీ దిగిన ఫోటో వైరల్ అవుతోంది. 

 

5:04 PM IST:

భారతీయుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం సాకారమైంది. రామ్ లల్లా విగ్రహా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వున్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ప్రతిరోజూ 1 నుంచి 1.5 లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శించనున్నారని అంచనా. ఈ మేరకు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ గ్రూప్ పేర్కొంది. దీని ప్రకారం ఏడాదికి 5 కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం వుంది. 

4:58 PM IST:

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆలయ నిర్వాహక కమిటీ ఆహ్వానించింది. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రెటీలు అలియా భట్ - రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు. 

4:39 PM IST:

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామ్ లల్లా దర్శనమివ్వనున్నారు. వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా రామ దర్శనం లభించనుంది. తొలి స్లాట్ ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గటల వరకు రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒకరోజు ముందుగానే బుకింగ్ చేసుకోవాలని రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. 

4:29 PM IST:

అయోధ్య రామ మందిర ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులు, ఇంజనీర్ల బృందంపై మోడీ పూల వర్షం కురిపించారు. 

4:14 PM IST:

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అద్భుతమన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది దేశంలోని ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవమన్నారు. తాను అయోధ్యకు రావడం తన అదృష్టమన్నారు .
 

4:02 PM IST:

రామకార్యం అంటే రాజ్య కార్యమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సెల్ఫీ దిగి దానిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇవాళ తాను భావోద్వేగానికి గురయ్యానని, ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయన్నారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింత పెంచిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

 

3:50 PM IST:

రామ్ లల్లా విగ్రహ రూపశిల్పి అరుణ్ యోగిరాజ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్షణం ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని తానేనని ఆయన అన్నారు. తన పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్ లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై వుంటాయని యోగిరాజ్ పేర్కొన్నారు. రామ్ లల్లా విగ్రహాన్ని 51 అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు యోగిరాజ్. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడిపై సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారు. 

3:39 PM IST:

అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటీ ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన సతీమణి నీతా అంబానీలు అయోధ్యకు చేరుకుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది చారిత్రాత్మక దినమని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. జనవరి 22న ఇకపై రామ్ దివాళీగా జరుపుకుంటారని అన్నారు. 

 

3:33 PM IST:

అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటీ ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలో భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, భారత  బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్‌లు అయోధ్య వేదిక వద్ద కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ దిగారు. 

 

3:26 PM IST:

అయోధ్య ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులు, ఇతర సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో వీరిపై స్వయంగా పూలు జల్లారు మోడీ. 

3:18 PM IST:

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం మనమంతా గర్వపడాల్సిన సమయమన్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇది కొత్త శకానికి ఆరంభమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు రామ్ లల్లాకు ప్రధాని మోడీ పూజలు చేస్తున్న వీడియోను ఆయన పంచుకున్నారు. 

2:56 PM IST:

దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర్ ఇదే మన కొత్త నినాదమన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఇవాళ దేశంలో నిరాశవాదానికి చోటు లేదని, వున్న బలాన్ని కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలని మోడీ చెప్పారు. పరాక్రమవంతుడైన రాముడిని నిత్యం పూజించాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

2:53 PM IST:

రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమని.. ఈ క్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనమని మోడీ చెప్పారు. మనదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలమని.. ఈ క్షణం మన విజయానికే కాదు, వినయానికి కూడా సూచిక అని మోడీ తెలిపారు. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్ధం చేసుకోలేకపోయారని, పవిత్రత, శాంతి , సామరస్యం భారత ఆత్మకు ప్రతిరూపమని ప్రధాని వ్యాఖ్యానించారు. వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానమని మోడీ తెలిపారు. అత్యున్నమైన ఆదర్శ వ్యక్తికి ఇవాళ ప్రాణ ప్రతిష్ట జరిగిందని ప్రధాని పేర్కొన్నారు. రాముడే భారత్ ఆధారం, రాముడే భారత్ విధానమన్నారు. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్టే కాదు, భారత విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ట అన్నారు. రాముడు అగ్ని కాదని, రాముడు వెలుగు అని మోడీ పేర్కొన్నారు. 

2:38 PM IST:

కలియుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం ఇవాళ దీపావళిని జరుపుకుంటోందని, రాముడు భారతదేశ ఆత్మ అని  ప్రధాని చెప్పారు. రాముడు లోకానికి ఆదర్శమని, అన్ని భాషల్లోనూ రామాయణం విన్నానని ఆయన తెలిపారు. రామమందిరాన్ని న్యాయమైన ప్రక్రియలో నిర్మించామని , ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టానని, అన్ని రాష్ట్రాల్లో వున్న రాముడి ప్రధాన ఆలయాలను దర్శించానని మోడీ చెప్పారు. 500 ఏళ్లుగా రామమందిరం నిర్మాణం ఎందుకు జరగలేదో అందరూ ఆలోచించాలని ప్రధాని పిలుపునిచ్చారు. రాముడంటే వివాదం కాదని, రాముడంటే సమాధానమని మోడీ అభివర్ణించారు. 

2:28 PM IST:

రామ్ లల్లా ఇక టెంట్‌లో వుండరు, గర్భగుడిలోనే వుంటారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాముడు వచ్చేశాడని, కాలచక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయమని మోడీ పేర్కొన్నారు. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టకు హాజరుకావడం తన అదృష్టమని, ఈ క్షణం ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోందని ప్రధాని తెలిపారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని, ఎక్కడ రాముని కార్యక్రమం జరుగుతుందో.. అక్కడ హనుమంతుడు వుంటాని మోడీ చెప్పారు.

ఎన్నో ఏళ్ల  పోరాటాలు , బలిదానాలు, నిష్ట తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని ప్రధాని తెలిపారు. తన శరీరం ఇంకా అనుభూతిని ఆస్వాదిస్తోందని, ఇది సామాన్యమైన సమయం కాదన్నారు. తన మనస్సంతా బాలరాముడి రూపంపైనే వుందని, రామాయణ కాలంలో 14 ఏళ్ల వనవాసం వుందని మోడీ చెప్పారు. రాముడి కోసం ప్రజలు 14 ఏళ్లు ఎదురుచూశారని, ఈ యుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని ప్రధాని తెలిపారు. 

2:11 PM IST:

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌లకు యూపీ సీఎం యోగి ఆదత్య నాథ్ కానుకలు అందజేశారు. అయోధ్య ఆలయ ఆకృతిలో వుండే బహుమతులు సమర్పించారు. 

 

2:11 PM IST:

అయోధ్యలో రామ్ లల్లాతో పాటు సరికొత్త భారత్ ఆవిష్కృతం అయ్యిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. చిన్నచిన్న గ్రామాల్లో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా జోష్ తో పాటు ఆలోచనలు చేయాల్సి  వుందన్నారు. ప్రధాని చాలా కఠోర దీక్ష చేసారు.... ఆయన తపస్వి కాబట్టే చేసారన్నారు, అయోధ్యలోంచి రాముడు ఎందుకు బయటకు వెళ్లారో ఆలోచించాలని అన్నారు. 500 సంవత్సరాల తర్వాత రామయ్య తిరిగి అయోధ్యకు వచ్చారు... ఇది ఆనందదాయకమని అన్నారు.. ప్రధానిలాగే మనం కూడా రామరాజ్య స్థాపనకు కృషిచేయాలని మోహన్ భగవత్ సూచించారు. 

2:00 PM IST:

500 ఏళ్ళ నిరీక్షణ తర్వాత రామమందిర నిర్మాణం జరిగిందని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం యావత్ దేశం అయోధ్య వైపే చూస్తోందన్నారు. రామనామ స్మరణ వింటుంటే మనం త్రేతాయుగంలో వున్నట్లుగా వుందన్నారు. రామ భక్తుల హృదయంలో సంతోషం వుందన్నారు. ఎక్కడ మందిరం కట్టాలనుకున్నామో అక్కడే కట్టాం... 
భారత ప్రజలు నిరీక్షణ ఈరోజు తీరిందన్నారు. ఈ కల సాకారం చేసిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.అయోధ్య అభివృద్ది శరవేగంగా జరుగుతోందని అన్నారు. ఆ రామయ్య కృపతో అయోధ్య ప్రశాంతంగా వుంటుంది. రామరాజ్య స్థాపన జరుగుతుందని యోగి అన్నారు.  
 

1:45 PM IST:

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ముగియడంతో 11 రోజుల ఉపవాసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముగించారు.  స్వామీజీ ప్రధానికి పాలు తాపి ఉపవాసాన్ని విరమింపజేసారు.

1:34 PM IST:

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శాలువాతో సత్కరించారు. అనంతరం అయోధ్య రామమందిర వెండి జ్ఞాపికలను యూపీ సీఎం ప్రధాని మోదీ, మోహన్ భగవత్ కు అందించారు. . 
 

1:32 PM IST:

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శాలువాతో సత్కరించారు. 

1:28 PM IST:

రామమందిర ప్రారంభోత్సవాని విచ్చేసిన అతిథులకు ప్రధాని మోదీ నమస్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపైకి చేరుకున్నారు.  
 

1:25 PM IST:

అయోద్య రామమందిరంలో బాలరాముడికి తొలి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు ప్రధాని మోదీ. అనంతరం రామయ్యకు తొలి హారతి కూడా ప్రధాని ఇచ్చారు. పూజల తర్వాత ఆలయంలో కలియతిరుగుతూ పరిశీలించారు ప్రధాని మోదీ. 
 

1:16 PM IST:

ప్రధాని మోదీ బాలరాముడి చుట్టే ప్రదక్షిణలు చేసారు. అనంతరం రామయ్య ముందు సాష్టాంగ నమస్కారం చేసారు.

1:13 PM IST:

 అయోధ్య బాలరాముడికి ప్రధాని మోదీ పూజలు ముగిసాయి. పూజా కార్యక్రమాలు ముగియడంతో ప్రధాని గర్భాలయం నుండి బయటకు వస్తున్నారు.  
 

12:56 PM IST:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడికి హారతి ఇచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రామయ్యకు హారతి ఇచ్చారు. అయోధ్య  బాలరాముడికి ప్రధాని ఫలాలు సమర్పించారు.  

 

12:49 PM IST:

ప్రధాన మంత్రి మోదీతో పాటు అయోధ్య బాలరాముడికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు నిర్వహించారు. 

12:47 PM IST:

అయోధ్య బాలరాముడు ఆభరణాలు ధరించి మరింత సుందరంగా మారారు. ఆ రామయ్య ప్రాణప్రతిష్ట పూజలు అందుకుంటున్నారు. 

12:45 PM IST:

12:39 PM IST:

అయోధ్య రామమందిరంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అతిథులు మైమరచిపోయారు. 

12:33 PM IST:

అయోధ్య బాలరాముడికి ప్రధాని మోదీ పూజ నిర్వహించారు. రామయ్య పాదాలపై పుష్ఫాలు పెట్టి నమస్కరించుకున్నారు. 
 

12:26 PM IST:

అయోధ్య  బాలరాముడు కొలువైన గర్భగుడిలో  ప్రధాని నరేంద్ర మోదీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాత్రమే పాల్గొన్నారు. 

12:22 PM IST:

ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్  మోహన్ భగవత్ ఆలయంలో పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


 

12:18 PM IST:

పూజా సామాగ్రిని ప్రధాని మోదీ  పూజారులకు అందించారు. దీంతో ఆలయ ప్రాణప్రతిష్ట పూజలు ప్రారంభమయ్యాయి.  ప్రధాని మోదీ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గోన్నారు. 


 

12:17 PM IST:

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయి.  ప్రధాని నరేంద్ర మోదీ ఆలయానికి చేరుకున్నారు. 

11:53 AM IST:

ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ చాలామంది అయోధ్యకు చేరుకున్నారు. బాలీవుడ్ జంటలు రణ్ బీర్-ఆలియా, విక్కీ కౌశల్-కత్రినా జంట ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. 

11:36 AM IST:

అయోధ్య రామమందిర ప్రాంగణం అతిథులతో నిండిపోయింది. ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో రామమందిరానికి చేరుకోనున్నారు. 

11:27 AM IST:

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాంస్కృతిక నృత్యాలు, పాటలతో అతిథులను అలరిస్తున్నారు.

11:23 AM IST:

అయోధ్య రామమందిరాన్ని ఆకాశం నుండి చూస్తే మరింత అద్భుతంగా కనిపిస్తోంది. ఆలయ విహంగ వీక్షణ వీడియో మీకోసం.  

11:14 AM IST:

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం చీఫ్ మోహన్ భగవత్ అయోధ్యకు చేరుకున్నారు. ప్రధాని మోదీతో పాటు ఆయన గర్భగుడిలోకి వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 
 

11:18 AM IST:

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ దంపతులు హాజరయ్యారు. అలాగే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జోడి కూడా జంటగా అయోధ్యకు విచ్చేసారు. 

11:04 AM IST:

జనసేన పార్టీ అధినేత, తెలుగు సినీనటులు పవన్ కల్యాణ్ అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసారు.  

11:18 AM IST:

అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ తో కలిసి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసారు. 

10:47 AM IST:

రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకకోసం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మరికొద్దిసేపట్లో రామమందిరానికి చేరుకోనున్నారు. 

10:35 AM IST:

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయోధ్య రామమందిర ప్రాంగణానికి చేరుకున్నారు. అతిథుల కోసం ఏర్పాటుచేసిన గ్యాలరీలో ఆయన ఇతర అతిథులతో పలకరిస్తూ కనిపించారు. 


 

10:28 AM IST:

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యను చూస్తుంటే పురాతన కాలంలో వున్నట్లు అనిపిస్తోందని అన్నారు.  యోగి ప్రభుత్వంపై కంగనా ప్రశంసలు కురిపించారు. 

 


 

10:20 AM IST:

చిరంజీవి, సురేఖ దంపతులు అయోధ్య రామమందిరానికి చేరుకున్నారు. వారివెంట తనయుడు రామ్ చరణ్ కూడా వున్నారు. వీరికి కాషాయ కండువా కప్పి స్వాగతం పలికారు నిర్వహకులు. 

10:21 AM IST:

రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం క్రీడా, సినీ ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులు, అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, హేమామాలిని బాలీవుడ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, సుమన్ వంటి టాలీవుడ్ సినీతారలు అయోధ్య రామమందిరానికి చేరుకున్నారు. 


 

10:06 AM IST:

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు బీజేపీ సీనియర్ నేత అద్వానీ హాజరుకావడం లేదని సమాచారం. అయోధ్యలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన రావట్లేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

9:57 AM IST:

తెలంగాణ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్  రామమందిర ప్రారంభోత్సవంలోవేడుకల కోసం అయోధ్యకు చేరుకున్నారు. ప్రస్తుతం అయోధ్య భూలోక స్వర్గంగా కనిపిస్తోందని అరవింద్ అన్నారు. 


 

10:28 AM IST:

అయోధ్య రామమందిరానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ చేరుకున్నారు. ఆయన ఆలయ ప్రారంభోత్సవాలను స్వయంగా పరిశీలిస్తున్నారు.  

9:49 AM IST:

ప్రారంభోత్సవ వేడుకల కోసం అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ప్రాంగణంలో వేదికను ఏర్పాటుచేసి అతిథులు కూర్చోడానికి కుర్చీలు వేసారు. అలాగే ఆలయాన్ని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు.  

9:28 AM IST:

అయోధ్య రామయ్య ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో శ్రీరాముడి 3డి ఫోటో ప్రదర్శిస్తున్నారు. 

 

9:37 AM IST:

అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను కనులారా వీక్షించేందుకు సాధుసంతులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అయోధ్య రామమందిర ప్రాంగణమంతా కాషాయమయం అయ్యింది.