పెండ్లి చేసుకొమ్మనందుకు ప్రియురాలి హత్య
Crime News: ఆగస్టు 15న 24 ఏళ్ల యువతిని హత్య చేసి, సాక్ష్యాలను ధ్వంసం చేసే క్రమంలో మృతదేహాన్ని ముక్కలుగా నరికి చంపిన ఆరోపణలపై ఔరంగాబాద్ లోని వైజాపూర్కు చెందిన 31 ఏళ్ల స్థానిక జర్నలిస్టును ఔరంగాబాద్ రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
Aurangabad: పెండ్లి చేసుకొమ్మంటున్నదని ఓ దుర్మార్గుడు తాను ప్రేమిస్తున్న మహిళను అత్యంత క్రూరంగా నరికి ప్రాణాలు తీశారు. సాక్ష్యాలను మాయం చేసేందు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నిర్మానుష్య ప్రాంతంలో పడేయడానికి కారులో వెళ్తుండగా పోలీసులు పట్టుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. ఆగస్టు 15న 24 ఏళ్ల యువతిని హత్య చేసి, సాక్ష్యాలను ధ్వంసం చేసే క్రమంలో మృతదేహాన్ని ముక్కలుగా నరికి చంపిన ఆరోపణలపై ఔరంగాబాద్ లోని వైజాపూర్కు చెందిన 31 ఏళ్ల స్థానిక జర్నలిస్టును ఔరంగాబాద్ రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. జర్నలిస్ట్ సౌరభ్ లఖే , మహిళ ప్రేమించుకుంటున్నారని, గత నాలుగు నెలలుగా ఔరంగాబాద్లోని ఎన్-11 సెక్టార్లోని అద్దె గదిలో నివసిస్తున్నారని దేవ్గావ్-రంగారి పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అమోల్ మోర్ తెలిపారు. అయితే, వీరికి ఇప్పటికే వేరే వాళ్లతో పెండ్లి కావడం గమానార్హం. "ఇద్దరూ విడివిడిగా వివాహం చేసుకున్నారు, కానీ మహిళ భర్త ఆమెను విడిచిపెట్టాడు. ఈ క్రమంలోనే సౌరభ్ లఖే, సదరు మహిళ ఓ అద్దె గది తీసుకుని కలిసి ఉంటున్నారు. అయితే, తనను వివాహం చేసుకోవాలని ఆమె లాఖే గత కొన్ని రోజులుగా పట్టుబట్టింది. మహిళ డిమాండ్లపై విసుగు చెంది, ఆవేశంతో లాఖే ఆమెను అత్యంత క్రూరంగా నరికి చంపాడు" అని పోలీసులు తెలిపారు.
సదరు మహిళను చంపిన తర్వాత.. ఆమె డెడ్ బాడీని మాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికీ తెలియకుండా నిర్మానుష్య ప్రాంతంలో పడేయాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే నరికి శరీర బాగాలను తన కారులో పెట్టుకుని బయలుదేరాడు. అయితే, Aurangabad లోని కన్నాడ్ తాలూకాలోని దేవ్గావ్-రంగారి సమీపంలో లాఖే మహిళ కొన్ని శరీర భాగాలను తీసుకువెళుతున్న అతని కారును పోలీసులు అడ్డగించి తనిఖీ చేయగా, ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యాదృచ్ఛికంగా, లఖే తన నేరాన్ని వాట్సాప్ గ్రూప్లో అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
హత్య జరిగిన ఒక రోజు తర్వాత సౌరభ్ లఖే మహిళ చేతులు, తలను నరికివేసినట్లు దేవ్గావ్-రంగారి పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అమోల్ మోర్ చెప్పారు. "అతను బుధవారం తన గ్రామానికి సమీపంలో మిగిలిన శరీర భాగాలను కత్తిరించి పారవేయాలని ప్లాన్ చేశాడు. దీనిపై పక్కా సమాచారం అందడంతో అతని కారును అడ్డగించాం' అని తెలిపారు. సిడ్కో పోలీస్ స్టేషన్ పరిధిలో లఖేని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలావుండగా, రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని ఒక గ్రామంలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 32 ఏళ్ల మహిళకు నిందితులు నిప్పటించి, సజీవదహనం చేసే ప్రయత్నం చేశారు. ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరు రోజుల తరువాత మరణించింది. ఆమె ఉపాధ్యాయురాలని, ఆమె తన కొడుకుతో కలిసి ఆగస్టు 10 న పాఠశాలకు వెళ్తుండగా నిందితులు ఆమెపై దాడి చేశారని తెలిసింది.