Asianet News TeluguAsianet News Telugu

కోల్ కత్తాలో దారుణం.. మహిళపై ముగ్గురు బంగ్లాదేశీయుల సామూహిక అత్యాచారం..

ఓ మహిళపై బంగ్లాదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Atrocity in Kolkatta.. Three Bangladeshis gang-raped a woman..
Author
First Published Dec 2, 2022, 11:03 AM IST

కోల్ కత్తాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ముగ్గురు బంగ్లాదేశీయులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె అనారోగ్యంతో ఉందని వారించినా దుండగలు పట్టించుకోలేదు. కనీసం ఆమెకు మెడిసిన్ కూడా అందించేందుకు ప్రయత్నించలేదు. ఈ ఘటన ఓ హోటల్ గదిలో జరిగింది. అత్యాచారం జరిగిన అనంతరం ఆమెను బయటకు గెంటేశారు.

పెళ్లిలో భోంచేశాడని, అంట్లు తోమించారు.. ఎంబీఏ విద్యార్థికి చేదు అనుభవం.. వీడియో వైరల్ అవ్వడంతో...

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ లోని ఢాకా నగరానికి చెందిన ఎండీ రాసెల్ ఎస్కే (37), ఎండీ కైజర్ చౌదరి (36), ఎండీ అబ్దుల్లా అల్ మిజాన్ (37) అనే ముగ్గురు వ్యాపారులు కొన్ని రోజుల కిందట కోల్ కత్తా నగరానికి వచ్చారు. అయితే నదియా ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వారు సానిహిత్యం పెంచుకున్నారు. వారందరూ కలిసి న్యూ మార్కెట్ ప్రాంతంలోని ఓ హోటల్ లో ఉండేవారు. బాధిత మహిళ కూడా అదే హోటల్ లో ఉండేది. అయితే బుధవారం రాత్రి ఆమెపై ముగ్గురు దుండగులు వారి హోటల్ గదిలో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. 

వామ్మో.. ప్రియుడితో వెళ్లిపోవాలని తన పోలికలతో ఉన్న మహిళను చంపి, బట్టలు వేసి, ఆత్మహత్యగా చిత్రీకరణ..

అనంతరం సెక్యూరిటీ గార్డులను పిలిపించి ఆమెను హోటల్ నుంచి బయటకు వెళ్లగొట్టారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, మందులు అవసరమని బాధితురాలి నిందితులను వేడుకున్నా కూడా వారి దానికి అంగీకరించలేదు. ఆమె చేసిన విజ్ఞప్తిని నిందితులు నిరాకరించారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటనపై బాధితురాలు న్యూమార్కెట్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించింది. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

ఈ ప్రయాణం మరుపురానిది.. ఆటో డ్రైవర్ పై ప్రశంసలు...!

ఈ ఘటనపై న్యూ మార్కెట్ స్టేషన్ కు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘బుధవారం రాత్రి బాధితురాలు తమకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదును స్వీకరించి మేము హోటల్ లో తనిఖీలు నిర్వహించాం. నిందితులపై అత్యాచారం, చీటింగ్‌కు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. దర్యాప్తులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశాం’’ అని ఆయన చెప్పినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం నివేదించింది.

ఆర్కెస్ట్రాలో పాడుతూ.. అమ్మాయిల మనసు దోచాడు...నాలుగు రాష్ట్రాల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చివరికి..

హోటల్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలో మేజిస్ట్రేట్ ఎదుట మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని చెప్పారు. హోటల్ ఉద్యోగుల వాంగ్మూలాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios