Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ప్రియుడి ఇంటి వాటర్ ట్యాంకులో శవంగా తేలిన ప్రియురాలు.. అసలేం జరిగిందంటే ?

ఓ ప్రియురాలిని ప్రియుడు దారుణంగా హత్య చేసి డెడ్ బాడీని వాటర్ ట్యాంకులో ఉంచాడు. ఈ ఘటన యూపీలోని ప్రయాగ్ రాజ్ లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Atrocious.. The girlfriend who was found dead in the water tank of her boyfriend's house.. What actually happened?..ISR
Author
First Published Jun 10, 2023, 10:03 AM IST

14 రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఓ మహిళ తన ప్రియుడి ఇంటిలోని వాటర్ ట్యాంకులో శవంగా తేలింది. ఈ ఘటన యూపీలోని ప్రయాగ్ రాజ్ లో చోటు చేసుకుంది. అయితే ఆమెను ప్రియుడే హత్య చేసి ఉంటాడనే అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. 

వాహనదారులకు భారీ ఊరట.. 2017-2021 మధ్య ఉన్న ట్రాఫిక్ చలాన్లు రద్దు

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల రాజ్ కేసర్ గత నెల 30వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మహిళ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమునాపర్ కర్చానా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేవా ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. 

దీంతో పోలీసులు అరవింద్ యమునాపర్ కు చెందిన నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి చేరుకున్నారు. ఆ మహిళ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంకులో రాజ్ కేసర్ మృతదేహం కనిపించింది. అరవింద్, రాజ్ కేసర్ ప్రేమికులు అని పోలీసులు తెలిపారు. నిందితుడు తన ప్రేయసిని 14 రోజుల కిందట హత్య చేసి ఆమె మృతదేహాన్ని తన ఇంట్లోని ట్యాంకులో దాచిపెట్టి ఉంటాడని పోలీసుల భావిస్తున్నారు.

దారుణం.. వితంతువుపై దొంగ అత్యాచారం.. అనంతరం నగలు ఎత్తుకెళ్లిన దుండగుడు

మృతురాలి కాల్ డీటెయిల్స్ ఆధారంగా నిందితుడి అరవింద్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు  కర్చానా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) విశ్వజీత్ సింగ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని థానే లో సరస్వతి వైద్య హత్య జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే అదే తరహాలోనే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆ ఘటనలో బాధితురాలు, నిందితుడైన 56 ఏళ్ల మనోజ్ సానేను 2014లో ముంబయిలో బోరివలీలోని ఓ రేషన్ షాప్‌లో కలిసింది. ఆ రేషన్ షాప్‌లో అతడు వర్కర్. అక్కడే బాధితురాలు సరస్వతి వైద్య కలిసింది. ఆ తర్వాత వారిద్దరూ డేటింగ్ ప్రారంభించారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంటిలో నివసించారు. 

ప్రధాని మోదీ డిగ్రీపై కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్.. విచారణ ఎప్పుడంటే..?

సరస్వతి వైద్య అనాథ. మనోజ్ సానెతో జీవితాన్ని పంచుకోవాలని ఆశ పడింది. మనోజ్ సానె, ఆమె పెళ్లి చేసుకోలేదు. కానీ, కలిసి జీవించారు. మనోజ్ సానెకు బోరివలిలో సొంత ఇల్లు ఉన్నది. కానీ, ఆయన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. మీరా రోడ్‌లోని ఏడంతస్తుల అపార్ట్‌మెంట్‌లో 704 గదిలో వారిద్దరూ కలిసి ఉన్నారు. గత ఐదేళ్లుగా అందులోనే ఉన్నారు. కానీ, వారిద్దరు ఇరుగు పొరుగుతో పెద్దగా కలిసేవారు కాదు. అయితే ఇటీవల వారిద్దరు ఉంటున్న గది నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios