Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. వితంతువుపై దొంగ అత్యాచారం.. అనంతరం నగలు ఎత్తుకెళ్లిన దుండగుడు

తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. నడివయస్కురాలైన ఓ వితంతువుపై దొంగ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి బంగారు అభరణాలను ఎత్తుకెళ్లాడు. పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. 

Atrocious.. The thief raped the widow.. Then the thug took the jewelry..ISR
Author
First Published Jun 10, 2023, 8:35 AM IST

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు, వితంతువులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా తమిళనాడు లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ వితంతవుపై దొంగ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఔరంగజేబును పొగుడుతూ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టిన 14 ఏళ్ల బాలుడు.. మహారాష్ట్రలోని బీడ్ లో ఉద్రిక్తత

తమిళనాడులోని మదురై జిల్లా చింతామణి ప్రాంతంలో ఓ మధ్య వయస్కురాలైన వితంతువుపై గుర్తుతెలియని యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె నగలను దోచుకెళ్లాడు. ప్రాణాలతో బయటపడిన 54 ఏళ్ల మహిళ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. చింతామణి ప్రాంతంలో 54 ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమె భర్త గతంలో చనిపోయారు. నిర్మానుష్య ప్రాంతంలో ఉండే ఆమె ఇంటి గోడపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కూర్చొని ఉన్నాడు. దీనిని ఆమె గమనించింది. అలా గోడపై కూర్చున్నది ఎవరో అని తెలుసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి అతడి వద్దకు చేరుకుంది. ఎక్కడి నుంచి వచ్చావని, గోడపై ఎందుకు కూర్చున్నావని అతడి వివరాలు ఆరా తీసింది. కానీ ఆ యువకుడు ఆమెకు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు.

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బెదిరింపులు.. హోం మినిస్టర్ జోక్యం చేసుకోవాలి - సుప్రియా సూలే

కొంత సమయం తరువాత ఆ దుండగుడు మహిళను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి బంగారు గొలుసును లాక్కొని వెళ్లిపోయాడు. ఘటన జరిగిన ఇల్లు నిర్మానుష్య ప్రాంతంలో ఉండటంతో అతడిని ఎవరూ గమనించలేదు. అయితే సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని మదురై జిల్లా ఎస్పీ ఆర్.శివప్రసాద్ పరిశీలించారు. కాగా.. ఇలాంటి ఘటనే ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో వెలుగు చూసింది. ఓ బాలుడు 14 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె తలపై సుత్తితో మోది.. ఉరేసి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో.. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఓ బాలుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె మీద అత్యాచారం చేశాడు.

హిజాబ్ వివాదం.. పాఠశాలల్లో మత మార్పిడికి పాల్పడితే ఊరుకోబోము - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

అంతటితో ఊరుకోకుండా.. ఆమె తలపై సుత్తితో కొట్టాడు. ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరి వేశాడు. సాయంత్రం పనుల నుంచి ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు ఓ బాలుడు వరండాలో నిల్చుని ఉండడం గమనించారు. దీంతో అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే.. తల్లిదండ్రులను చూసిన బాలుడు తప్పించుకున్నాడు. వారికి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. బాలిక ఫ్యానుకు వేలాడుతూ శవంగా కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు కోసం గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios