Asianet News TeluguAsianet News Telugu

చోరీ కేసులో నిందితుడి అరెస్టు కోసం వెళ్లిన పోలీసులు.. దాడి చేసిన గ్రామస్తులు.. ఎక్కడంటే?

అసోంలో పోలీసులు చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి దొంగ స్వగ్రామం వెళ్లారు. వారు వెళ్లగానే ఆ నిందితుడి అరెస్టును అడ్డుకుంటూ స్థానిక యువత సిబ్బందిపై దాడికి దిగింది. వారి వాహనాన్నీ ధ్వంసం చేసింది.
 

assam police gets beaten up by local youth when they tried to arrest theft case accused kms
Author
First Published Nov 5, 2023, 4:37 PM IST

గువహతి: పోలీసులు ఓ చోరీ కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేయడానికి వెహికిల్‌లో బయల్దేరారు. ఆ పోలీసులు యూనిఫామ్‌లో లేరు. నిందితుడి గ్రామం మీదుగా వెళ్లుతుండగా.. ఆ గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. పోలీసులను చితకబాదారు. ఈ ఘటన అసోంలో శనివారం రాత్రి చోటుచేసుకున్నట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.

ఆఫీస్ ఇంచార్జీ భాస్కర్మల్లా పొటవారి సారథ్యంలోని రంగియా పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసుల బృందం నిందితుడిని అరెస్టు చేయడానికి వాహనంలో బయల్దేరారు. కామరూప్ జిల్లాలోని బరువాంజని ఆ నిందితుడి గ్రామం. పోలీసులు ఆ గ్రామానికి చేరుకోగానే స్థానికులు ఆగ్రహించారు. చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేయడాన్ని ఆ స్థానిక యువత అడ్డుకుంది.

పోలీసులను వారు చితకబాదారు. వారి వాహనంపైనా దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు యూనిఫామ్‌లో లేరు. అయినా, వారు తాము పోలీసులం అని చెప్పారు. కానీ, స్థానికులు వినిపించుకోలేదు. పోలీసు సిబ్బందిని గాయపరచడమే కాదు.. ఆ వాహనాన్నీ డ్యామేజ్ చేశారు.

Also Read: గాజా మీద న్యూక్లియర్ బాంబ్: ఇజ్రాయెల్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. పీఎం నెతన్యాహు ఏమన్నారంటే?

ఈ సమాచారం అందగానే కామరూప్ జిల్లా ఎస్పీ హితేశ్ రాయ్, సబ్ డివిజినల్ పోలీసు అధికారి సిజల్ అగర్వాల్‌లు వెంటనే అదనపు బలగాలతో స్పాట్‌కు చేరుకున్నారు. ఆ ఏరియాలో పోలీసులు మోహరించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కామరూప్ జిల్లాలో కలకలం రేపింది.

Follow Us:
Download App:
  • android
  • ios