గ్లోబల్ హంగర్ ఇండెక్స్పై మండిపడ్డ రాహుల్.. ఏమన్నాడంటే?
గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ ర్యాంకింగ్పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత్లో ఆకలి పెరగడం లేదని, ఇతర దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటించడం లేదని మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ ర్యాంకింగ్పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. వాస్తవాలతో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. భారతదేశంలో ఆకలి పెరగడం లేదని, కానీ ఇతర దేశాల్లో ప్రజలు ఆకలితో బాధపడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, 'ఆకలి, పోషకాహార లోపంలో 121 దేశాలలో భారతదేశం 107వ స్థానంలో ఉంది! ఇప్పుడు ప్రధాని, ఆయన మంత్రులు 'భారతదేశంలో ఆకలి పెరగడం లేదు, కానీ ఇతర దేశాలలో ప్రజలు ఆకలితో బాధపడటం లేదు' అని చెబుతారు.
దీనితో పాటు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై కూడా విమర్శలు గుప్పించారు. ‘రూపాయి పడిపోవడం లేదు కానీ డాలర్ బలపడుతోంది’ అని అమెరికాలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనపై రాహుల్ మండిపడ్డారు. అనేక ఇతర ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీల కంటే భారత రూపాయి మరింత మెరుగైన పనితీరు కనబరిచిందని ఆయన అన్నారు.
గ్లోబల్ ఇండెక్స్ ర్యాంకు విడుదలైన తర్వాత పలువురు ప్రతిపక్ష నేతలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే అచ్చే దిన్, అమృత్ కాల్. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు డబుల్ ఇంజిన్ డిజాస్టర్. దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లిన ప్రధాని మోదీజీకి ధన్యవాదాలు.అని పేర్కొన్నారు. అలాగే.. 'గ్లోబల్ హంగర్ ఇండెక్స్ భారత్ 107/121 వద్ద ర్యాంక్ చేసింది' అని రాసుకోచ్చారు.
అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. 2013లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ 63వ స్థానంలో ఉందని కాంగ్రెస్కు చెందిన కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు 2022లో 121 దేశాల జాబితాలో 107వ స్థానంలో నిలిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది దయనీయమైనది! ప్రధానిమోడీ ఉద్దేశ్యం ఇదేనా? అని ప్రశ్నించారు. గతేడాదితో పోలిస్తే భారత్ ఆరు స్థానాలు దిగజారిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం మాత్రం ఈ సూచీని "తప్పుడు సమాచారం"గా అభివర్ణించింది. భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రని ఆరోపించింది. ఈ నివేదిక మోడీ ప్రభుత్వ సొంత డేటా ఆధారంగా రూపొందించింది. ఇది కూడా భారతదేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమని భారత్ ఈ నివేదికపై పేర్కొంది.