Arvind Kejriwal: గుజరాత్‌లో ప్రతి ఇంట ఆమ్ ఆద్మీ పార్టీ  గురించి చర్చ జరుగుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కూ ఢిల్లీ, పంజాబ్ ప్ర‌జ‌లు మాత్రం ఆప్ ను ప్రేమించే వార‌ని.. ఇప్పుడుగుజరాత్ ప్రజలు కూడా ఆప్ ను ప్రేమించ‌డం ప్రారంభించార‌ని అన్నారు.  

Arvind Kejriwal: గుజరాత్‌లో ప్రతి ఇంట ఆమ్ ఆద్మీ పార్టీ గురించి చర్చ జరుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ, పంజాబ్ ప్రజలు లాగేనే.. ఇప్ప‌డు గుజ‌రాత్ ప్ర‌జ‌లు కూడా త‌న‌ని, త‌న పార్టీని ప్రేమిస్తున్నారని అన్నారు. ఈ ఏడాది చివ‌రిలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి సారించింది. నేడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన బహిరంగ సభలో పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. ఇందులో గుజరాత్‌లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ఢిల్లీతో పోల్చి బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దీంతో పాటు ఢిల్లీ మోడల్‌ను కూడా ప్రజల ముందు ఉంచారు కేజ్రీవాల్. 

ప్రస్తుతం గుజరాత్‌లో కూడా ఆప్ పార్టీ గురించి చర్చ జరుగుతోందని.. రాష్ట్ర‌వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ గురించే చర్చ ప్రారంభ‌మైంద‌ని అన్నారు. ఇప్ప‌టికే ఢిల్లీ ప్రజలు చాలా ప్రేమిస్తారు.. పంజాబ్ ప్రజలు చాలా ప్రేమిస్తారు. ఇప్పుడు గుజరాత్ ప్రజలు కూడా ఆప్ ను ప్రేమించ‌డం ప్రారంభించార‌ని అన్నారు. గుజరాత్‌లో ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటున్నార‌ని అన్నారు.

ఈ క్ర‌మంలో పలు ప‌థకాల గురించి చ‌ర్చించారు. ఢిల్లీలో వృద్ధులకు ఉచిత తీర్థయాత్రను అందించే పథకం ఉందని, ఇప్పటి వరకు ఢిల్లీలోని 50 వేల మంది వృద్ధులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. గుజరాత్‌లో 27 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉందనీ.. కానీ, ఎవరినైనా తీర్థయాత్రలు చేసేలా చేశారా? అని ప్ర‌శ్నించారు. ఢిల్లీలో గ‌త‌ మూడేళ్లలో 50 వేల మందికి పైగా ఉచిత తీర్థయాత్ర ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకున్నారనీ, 27 ఏళ్లలో మీరు ఒక్క పౌరుడిని కూడా పాదయాత్ర చేయలేదని పాటిల్ సాహెబ్‌కి చెప్పాలనుకుంటున్నాననీ, గుజ‌రాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే అందరూ ఉచిత పాదయాత్రలు చేసేలా చేస్తానని చెప్పదలుచుకున్నానని అన్నారు. 

ఢిల్లీ ప్ర‌భుత్వ పాఠ‌శాల గురించి ప్రస్త‌విస్తూ.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి త‌న వద్దకు వచ్చారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ తరహాలో గుజరాత్‌లో కూడా మంచి పాఠశాలలు నిర్మించాలని కోరార‌ని అన్నారు. గతంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కూడా దారుణంగా ఉండేది. కానీ ఐదేళ్లలో పాఠశాలల పరిస్థితిని మార్చాం. ఈ ఏడాది 99.7 శాతం ఫలితాలు వచ్చాయి. నాలుగున్నర లక్షల మంది పిల్లలు ప్రైవేట్ ఉద్యోగాలు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకున్నారు.