Asianet News TeluguAsianet News Telugu

రాజౌరీలో పాక్ కాల్పులు.. భారత జవాను మృతి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొంది. ఈ కాల్పుల్లో మన దేశానికి చెందిన హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ అమరుడైనట్లు తెలిపింది. శత్రువుల కాల్పులకు మన దళాలు గట్టిగా బదులిచ్చినట్లు పేర్కొంది.

Army jawan martyred in Pakistan firing along LoC in Jammu and Kashmir's Rajouri
Author
Hyderabad, First Published Nov 21, 2020, 3:01 PM IST

పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో, నౌషేరా సెక్టర్‌లో నియంత్రణ రేఖ వెంబడి శనివారం పాకిస్థాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో ఓ భారతీయ జవాను అమరుడయ్యారు. పాకిస్థాన్ దళాలకు భారతీయ దళాలు దీటుగా బదులిస్తున్నట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొంది. ఈ కాల్పుల్లో మన దేశానికి చెందిన హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ అమరుడైనట్లు తెలిపింది. శత్రువుల కాల్పులకు మన దళాలు గట్టిగా బదులిచ్చినట్లు పేర్కొంది. సంగ్రామ్ శివాజీ మొదట తీవ్రంగా గాయపడ్డారని, ఆ తర్వాత కొద్ది సేపటికి తుది శ్వాస విడిచారని తెలిపింది. ఆయన ధైర్యసాహసాలు, నిజాయితీగల సైనికుడని తెలిపింది. ఆయన కర్తవ్యబద్ధతకు, అంకితభావానికి మన దేశం రుణపడి ఉంటుందని నివాళులర్పించింది. 

ఇదిలావుండగా, జమ్మూ-కశ్మీరులోని నగ్రోటాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ ఛార్జ్ డిఅఫైర్స్‌ను పిలిచి, నిరసన తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios