జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఆర్మీ జవాన్ మృతి..!
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలోని రాజ్పోరా ప్రాంతంలోని హంజిన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్గా మారిందని ఆయన అన్నారు.
ఉగ్రవాదుల ఈ ఎదురు కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. అతడిని దగ్గర్లోని స్థానిక ఆసుపత్రిలో చేర్చించి, చికిత్స అందిస్తన్నామని తెలిపారు.
ఈ ఎన్కౌంటర్లో మూడు, నాలుగు అల్ట్రాలు చిక్కుకున్నట్లు భావిస్తున్నామని ఆయన తెలిపారు.