గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలతో పాకిస్తాన్ లో శిక్ష అనుభవిస్తున్న రిటైర్డ్ ఇండియన్ నేవి అధికారి కుల భూషణ్ జాదవ్ తరఫున కేసు వాదించేందుకు లాయర్ ను నియమించాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఇండియాకు తెలిపింది. ఏప్రిల్ 13వ తేదీలోగా ఈ నియామకం జరిగేలా చూడాలని చెప్పింది. 

ఇస్లామాబాద్ : మరణ శిక్ష ఖైదీ కులభూషణ్ జాదవ్ (Kulbhushan Jadhav) కు కూడా మానవ హక్కులు ఉంటాయ‌ని, కాబ‌ట్టి న్యాయమైన విచారణ హక్కును నిరాకరించలేమని పాకిస్తాన్ (pakistan)లోని ఇస్లామాబాద్ హైకోర్టు (Islamabad High Court) అభిప్రాయ‌ప‌డింది. ఆయ‌న మ‌ర‌ణ శిక్ష‌ రివ్యూ పిటిషన్‌పై విచారణకు హాజరు కావడానికి ఏప్రిల్ 13లోగా జాదవ్ తరపున న్యాయవాదిని నియమించాలని భార‌త్ (bharath)కు గురువారం సూచించింది. పాక్ మిలటరీ కోర్టు (Pakistani military court) జాదవ్‌పై విధించిన శిక్షను వ్యతిరేకించింది.

ఏప్రిల్ 2017లో గూఢచర్యం (espionage), ఉగ్రవాదం (terrorism) ఆరోపణలపై పాకిస్తాన్ మిలిటరీ కోర్టు (Pakistani military court) 51 ఏళ్ల రిటైర్డ్ ఇండియన్ నేవీ అధికారి జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ (consular access) నిరాకరించడంపై భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ICJ) ఆశ్రయించింది. జూలై 2019లో ICJ భారతదేశానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జాదవ్‌కు భారతదేశ కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని, అతని నేరారోపణపై సమీక్ష జరిగేలా చూడాలని పాకిస్తాన్‌ను కోరింది. జాద‌వ్ తరుఫున కేసు వాదించ‌డానికి భారత న్యాయవాదిని నియమించుకునే అవకాశం ఇవ్వాలని భార‌త ప్ర‌భుత్వం ప‌దే ప‌దే చెబుతోంది.

ఈ విష‌యంలో వాద‌న‌లు వినేందుకు 2020 ఆగస్టులో ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అథర్ మినాల్లా (Athar Minallah), జస్టిస్ అమీర్ ఫరూక్ (Justice Amir Farooq), జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్‌ (Justice Miangul Hassan Aurangzeb)లతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం కేసును ప‌రిశీలిస్తోంది. 

2021 నవంబర్ లో ICJ నిర్ణయం ప్రకారం జాదవ్‌కు మరణశిక్షపై అప్పీల్ చేసుకునే హక్కును కల్పించేందుకు పాకిస్తాన్ పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో బిల్లును ఆమోదించింది. ‘‘ కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) తీర్పును అమలులోకి తీసుకురావడానికి ఇంతకుముందు రూపొందించిన ఆర్డినెన్స్‌ను పాకిస్తాన్ చట్టంగా రూపొందిస్తున్నట్లు మాకు నివేదికలు అందాయి ’’ అని MEA తెలిపింది. సత్యం నుండి ఇంతకు మించి ఏమీ ఉండదు. ఇంతకు ముందు చెప్పినట్లుగా, ICJ యొక్క తీర్పు ద్వారా ఆదేశించిన విధంగా శ్రీ జాదవ్ కేసును సమర్థవంతమైన సమీక్ష మరియు పునఃపరిశీలన కోసం ఆర్డినెన్స్ యంత్రాంగాన్ని సృష్టించలేదు, MEA తెలిపింది.

పాకిస్థాన్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (సమీక్ష, పునఃపరిశీలన) చట్టం 2021 కులభూషణ్ జాదవ్ తన నేరాన్ని హైకోర్టు (high court)లో సవాలు చేసేందుకు అనుమతించింది.