విద్యుత్ జెన్కోలకు ఏపీ ఎలాంటి బకాయీ లేదు.. స్పష్టం చేసిన ప్రభుత్వం
విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఏపీ ఎలాంటి బకాయిలు పెండింగ్ లో లేవని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇంధన) కె.విజయానంద్ అన్నారు. కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇది జరిగిందని తెలిపారు.
పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేసిన విద్యుత్తు కోసం విద్యుత్ జనరేటర్లకు ఎలాంటి బకాయిలూ పెండింగ్ లో లేవని ఏపీ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బాకీ ఉన్నట్టు చూపుతోందని పేర్కొంది. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (POSOCO), భారత ప్రభుత్వ సంస్థ, మూడు పవర్ ఎక్స్ఛేంజీలు -- IEX, PXIL HPX -- జెన్కోస్కు బకాయిలు ఉన్న 13 రాష్ట్రాల్లో 27 డిస్కమ్ల ద్వారా విద్యుత్ కొనుగోలుపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
విరిగిపడ్డ కొండచరియలు.. కులూమనాలిలో చిక్కుకుపోయిన విశాఖ కార్పొరేటర్లు..
అయితే జెన్కోస్కు బకాయి ఉన్న రాష్ట్రాలలో ఏపీ కూడా ఉందని కేంద్రం తెలిపింది. దీనిపై ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇంధన) కె.విజయానంద్ స్పందించారు. ఈ విషయంపై శుక్రవారం స్పష్టతను ఇచ్చారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు జెన్కోస్కు ఎలాంటి బకాయిలు పెండింగ్ లో ఉంచలేదని అన్నారు. ‘‘ మేము రూ. 350 కోట్లను క్లియర్ చేసాము. కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా AP గడువు ముగిసినట్లు చూపుతోంది’’ అని విజయానంద్ అన్నారు.
సీజేఐ ఎన్వీ రమణతో సీఎం జగన్, చంద్రబాబు వేర్వేరుగా భేటీ..
గత కొన్ని నెలలుగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా రోజుకు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు ఏపీ ట్రాన్స్కో వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ డిమాండ్ రోజుకు 180-190 మిలియన్ యూనిట్లు కాగా దాదాపు 40-45 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడిందని అన్నారు. దీన్ని అధిగమించడానికి, రాష్ట్రం క్రమం తప్పకుండా ఎక్స్ఛేంజీల ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తోంది.
ఆత్మహత్యేనా?... వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి
కాగా.. POSOCO విద్యుత్ వ్యాపారంపై ఆంక్షలు విధించడంతో కొరతను అధిగమించడానికి అవసరమైన విద్యుత్ను సేకరించడం రాష్ట్రానికి కష్టమవుతుంది. ‘‘ కమ్యూనికేషన్ గ్యాప్ ను క్లియర్ చేయడానికి మేము POSOCO సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రస్తుతానికి మాకు క్లియర్ చేయడానికి గడువు లేదు. కాబట్టి ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్ ను కొనుగోలు చేయడంలో ఎలాంటి సమస్య ఉండకూడదు ’’ అని ఇంధన శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.