అనురాగ్ మాలు మౌంట్ అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో ఏప్రిల్ 17న అక్కడినుంచి దిగుతుండగా 6,000 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు కింద పడిపోయాడు.
న్యూఢిల్లీ : గత వారం నేపాల్లోని అన్నపూర్ణ పర్వతం దిగుతుండగా అదృశ్యమైన భారత పర్వతారోహకుడు అనురాగ్ మాలూ సజీవంగా దొరికాడు. మాలూ సోదరుడు సుధీర్ మాట్లాడుతూ.. "మాలూ సజీవంగా ఉన్నాడు. కానీ, అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అతను ఇంకా బతికే ఉన్నాడు" అని చెప్పారు.
అనురాగ్ మాలూ గత వారం అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు. కానీ ఏప్రిల్ 17న పర్వతం మీదినుంచి దిగుతుండగా 6,000 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు కింద పడిపోయాడు.
మాలూ 8,000 మీటర్ల పైన ఉన్న మొత్తం 14 శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఉన్నారు. మొత్తం ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పాయింట్లను అధిరోహించడం ద్వారా ప్రజల్లో వగాహన కల్పించడం తద్వారా యూఎన్ గ్లోబల్ గోల్స్ను సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే అతని సాహసాలను మాలూకు REX కరమ్-వీర్ చక్రను సాధించారు. భారతదేశం నుండి 2041 అంటార్కిటిక్ యూత్ అంబాసిడర్ గా కూడా మాలూ ఉన్నారు.
రాజ్ నాథ్ సింగ్ కు కోవిడ్-19 పాజిటివ్.. హోం క్వారంటైన్ లోకి వెళ్లిన రక్షణ శాఖ మంత్రి
ఇదిలా ఉండగా, నేపాల్లోని అన్నపూర్ణ పర్వతంలోని క్యాంప్ IV సమీపంలో తప్పిపోయిన 27 ఏళ్ల భారతీయ మహిళా పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ ను మంగళవారం నాడు రక్షించారని అధికారి తెలిపారు. "బల్జీత్ కౌర్ ఫ్రాస్ట్బైట్తో బాధపడుతోంది. ఇప్పుడు ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సిఐడబ్ల్యూఈసీ ఆసుపత్రికి ఆమెను తరలించారు" అని పయనీర్ అడ్వెంచర్ ఛైర్మన్ పసాంగ్ షెర్పా చెప్పారు.
పసాంగ్ షెర్పా చెప్పిన దాని ప్రకారం, బల్జీత్ కౌర్ 7,363 మీటర్ల ఎత్తు నుండి రక్షించబడింది. పర్వాతారోహకులు మిస్సింగ్ తరువాత.. రంగంలోకి దిగిన సెర్చ్ టీం క్యాంప్ IV పైన ఆమె ఉన్న లొకేషన్ ను ట్రేస్ చేశారు. బల్జీత్ కౌర్ సప్లిమెంటరీ ఆక్సిజన్ను ఉపయోగించకుండా ప్రపంచంలోనే 10వ ఎత్తైన అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించారని పసాంగ్ షెర్పా చెప్పారు.
IV క్యాంప్ వైపు ఒంటరిగా దిగుతున్న మహిళా పర్వతారోహకురాలిని సెర్చ్ టీమ్ గుర్తించిందని ఆయన తెలిపారు. సోమవారం బల్జీత్ కౌర్ తప్పిపోయిన తర్వాత ఆమెతో రేడియో సంబంధాలు కూడా తెగిపోయాయని.. కానీ, ఆమె మంగళవారం ఉదయం ఎలాగో SOSను పంపగలిగిందని తెలిపారు. దీంతో ఆమెను రక్షించడానికి మూడు హెలికాప్టర్లను రంగంలోకి దించాలని అధికారులను కోరారు.
ఆమె జీపీఎస్ లొకేషన్ 7,375 మీటర్లు (24,193 అడుగులు) ఎత్తులో ఉన్నట్లు చూసించిందని షెర్పా చెప్పారు. మొత్తానికి, బల్జీత్ కౌర్తో సహా ఐదుగురు పర్వతారోహకులు అన్నపూర్ణ పర్వతం చుట్టూ ఉన్న వివిధ శిబిరాల నుండి రక్షించబడ్డారు. నార్తర్న్ ఐరిష్ అధిరోహకుడు నోయెల్ హన్నా మృతదేహాన్ని క్యాంప్ IV నుండి ఖాట్మండుకు తీసుకువచ్చారు.
రక్షించబడిన మిగతా ముగ్గురిలో భారత్కు చెందిన అర్జున్ వాజ్పేయ్, పాకిస్థాన్కు చెందిన షెహ్రోజ్ కాషిఫ్, నైలా కియానిలు ఉన్నారు. మరో భారతీయ పర్వతారోహకుడు రాజస్థాన్కు చెందిన అనురాగ్ మాలు అదృశ్యమయ్యాడు.
