జమ్మూ కాశ్మీర్ లో మరో బ్లాస్ట్.. 8 గంటల్లో రెండో సారి బస్సులో పేలుడు..
జమ్మూ కాశ్మీర్ లో ఆగి ఉన్న బస్సుల్లో గురువారం పేలుడు సంభవించింది. అంతకు 8 గంటల ముందు కూడా ఇలాంటి బస్సు పేలుడు ఘటన చోటు చేసుకుంది.
జమ్మూకాశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లాలో గురువారం బాంబు పేలింది. పాత బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులో గురువారం తెల్లవారుజామున ఈ మిస్టరీ బ్లాస్ట్ జరిగింది. 8 గంటల వ్యవధిలో ఇది రెండో ఘటన.
దారుణం : భర్తమీద కోపంతో.. మామ మర్మాంగాన్ని కోసేసిన కోడలు..
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
సీనియర్ నటి వాణిశ్రీ స్థలం కబ్జా.. 11యేళ్ల తరువాత తిరిగి అప్పగించిన సీఎం..
ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి 10:45 గంటల ప్రాంతంలో డొమైల్ చౌక్ వద్ద ఇలాంటి ఘటనే జరిగింది. ఆగి ఉన్న బస్సులో ఇలాగే పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అయితే తాజా ఘటన జరిగిన ప్రాంతానికి ఈ డొమైల్ చౌక్ కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
PFI: పీఎఫ్ఐపై నిషేధం నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్
ఈ ఘటనలపై జమ్మూకాశ్మీర్ ఐజీ ముఖేష్సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 2 పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఉధంపూర్లోని వివిధ ప్రాంతాల్లో ఆగి ఉన్న బస్సులో ఈ పేలుళ్లు సంభవించాయని, ఒక పేలుడు రాత్రి జరిగిందని, ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు. మరో ఘటన ఉధంపూర్ బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులో జరిగిందని, ఇందులో ఎవరూ చనిపోలేదని అన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.