Asianet News TeluguAsianet News Telugu

జ‌మ్మూ కాశ్మీర్ లో మ‌రో బ్లాస్ట్.. 8 గంట‌ల్లో రెండో సారి బ‌స్సులో పేలుడు..

జమ్మూ కాశ్మీర్ లో ఆగి ఉన్న బస్సుల్లో గురువారం పేలుడు సంభవించింది. అంతకు 8 గంటల ముందు కూడా ఇలాంటి బస్సు పేలుడు ఘటన చోటు చేసుకుంది. 

Another blast in Jammu and Kashmir.. Second time in 8 hours there was an explosion in a bus..
Author
First Published Sep 29, 2022, 8:43 AM IST

జమ్మూకాశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లాలో గురువారం బాంబు పేలింది. పాత బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో గురువారం తెల్లవారుజామున ఈ మిస్ట‌రీ బ్లాస్ట్ జ‌రిగింది. 8 గంటల వ్య‌వ‌ధిలో ఇది రెండో ఘ‌ట‌న. 

దారుణం : భర్తమీద కోపంతో.. మామ మర్మాంగాన్ని కోసేసిన కోడలు..

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ న‌ష్ట‌మూ జ‌ర‌గ‌లేదు. ఎవ‌రికీ గాయాలు కాలేదు. ఈ ప్ర‌మాదం తెలిసిన వెంట‌నే జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

సీనియర్ నటి వాణిశ్రీ స్థలం కబ్జా.. 11యేళ్ల తరువాత తిరిగి అప్పగించిన సీఎం..

ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి 10:45 గంటల ప్రాంతంలో డొమైల్ చౌక్ వద్ద ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. ఆగి ఉన్న బ‌స్సులో ఇలాగే పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రికి గాయాలు అయ్యాయి. అయితే తాజా ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతానికి ఈ డొమైల్ చౌక్  కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

PFI: పీఎఫ్ఐపై నిషేధం నేప‌థ్యంలో ఢిల్లీలో పోలీసులు హై అల‌ర్ట్

ఈ ఘ‌ట‌న‌ల‌పై జమ్మూకాశ్మీర్ ఐజీ ముఖేష్‌సింగ్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 2 పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఉధంపూర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆగి ఉన్న బస్సులో ఈ పేలుళ్లు సంభవించాయ‌ని, ఒక పేలుడు రాత్రి జరిగింద‌ని, ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డార‌ని చెప్పారు. మ‌రో ఘ‌ట‌న ఉధంపూర్ బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో జ‌రిగింద‌ని, ఇందులో ఎవ‌రూ చ‌నిపోలేద‌ని అన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios