న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాసంపై జరిగిన చర్చలో పాల్గొన్న తర్వాత ప్రధానమంత్రి మోడీని కౌగిలించుకొని ఆ తర్వాత తన స్థానంలోకి వచ్చి కన్నుగీటాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ. అయితే ఈ ఘటన పార్లమెంట్లో నవ్వులు తెప్పించింది.
న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాసంపై జరిగిన చర్చలో పాల్గొన్న తర్వాత ప్రధానమంత్రి మోడీని కౌగిలించుకొని ఆ తర్వాత తన స్థానంలోకి వచ్చి కన్నుగీటాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ. అయితే ఈ పరిణామం పార్లమెంట్లో నవ్వులు కురిపించింది. ఇదిలా ఉంటే ఈ సన్నివేశాన్ని అమూల్ కంపెనీ డిజైన్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది. అమూల్ రూపొందించిన ఈ పిక్చర్ను పలువురు నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు.
కేంద్రంపై అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మోడీతో కలిసి కరచాలనం చేయడమే కాకుండా ఆయనను ఆలింగనం చేసుకొన్నాడు. ఆ తర్వాత త న స్థానంలోకి వచ్చి కూర్చొని కన్నుగీటాడు.ఈ విషయమై స్పీకర్ సుమిత్రా మహజన్ రాహుల్ తీరును తప్పుబట్టారు. నియమనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే మోడీ, రాహుల్ కౌగించుకొన్నట్టుగా అమూల్ తాజాగా ఓ పోస్టర్ను విడుదల చేసింది. రాహుల్, మోదీని కౌగిలించుకోవడాన్ని ఉటంకిస్తూ.. Embracing Ya embarrassing’ అంటూ ఓ పిక్చర్ను విడుదల చేసింది. రాహుల్ గాంధీ కన్నుకొట్టడాన్ని కూడ ఆ పిక్చర్ లో వేసింది. తాజాగా పార్లమెంట్లో చోటు చేసుకొన్న పరిణామాలను ప్రతిబింబించేలా అమూల్ రూపొందించిన ఈ పిక్చర్ నెటిజన్ల నుండి ప్రశంసలు పొందుతోంది.
పలువురు నెటిజన్లు ఆమూల్ను ఆకాశానికి ఎత్తుతున్నారు. వ్యంగ్యంతో పాటు హస్యాన్ని ప్రతిబింబించేలా కరెంట్ టాపిక్స్తో పిక్చర్స్ను రూపొందిస్తున్న అమూల్ బెస్ట్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
