ప్రఖ్యాత అమర్ నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. శుక్రవారం అమర్ నాథ్ గుహ పరిసరాల్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ఈ ఘటనలో ఇప్పటికు వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా... దాదాపు 12 వేల మంది భక్తులు వరదల్లో చిక్కుకుపోయారు. 

ప్రఖ్యాత అమర్ నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. శుక్రవారం అమర్ నాథ్ గుహ పరిసరాల్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ఈ ఘటనలో ఇప్పటికు వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా... దాదాపు 12 వేల మంది భక్తులు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

కాగా.. నిన్న సాయంత్రం నుంచి అమర్ నాథ్ పరిసర ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షం కారణంగా శుక్రవారం ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఈ ఘటనలో యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా వరద ముంచుకురావడంతో భారీగా యాత్రికులు కొట్టుకుపోయారు. వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

ఇకపోతే.. జూన్ 30న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఆగస్టు 11న రక్షా బంధన్ రోజున అమర్ నాథ్ యాత్ర ముగియనుంది. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి యాత్ర సాగడం లేదు. చివరిసారిగా 2019 జూలై 1 నుంచి ఆగస్టు 1 వరకు యాత్ర జరిగింది. అప్పుడు 3.42 లక్షల మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు.