సేవలను మరింత విస్తృతం చేయబోతున్న ఆకాసా ఎయిర్.. సెప్టెంబర్ చివరి నాటికి ..
ఆకాసా ఎయిర్: ఆకాసా ఎయిర్ దేశంలో తన సేవలను విస్తృతం చేయాలని భావిస్తుంది. సెప్టెంబరు చివరి నాటికి ఆకాసా ఎయిర్ 150కి పైగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కంపెనీ తన పూర్తి ప్రణాళికను ప్రకటించింది.
ఆకాసా ఎయిర్: దివంగత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ ఝంఝన్ వాలాకు చెందిన ఆకాసా ఎయిర్ విమాన రంగంలోకి తాజాగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై ,కొచ్చిలలో తన నెట్వర్క్ ను ప్రారంభించింది. తాజాగా.. శుక్రవారం నాడు అకాసా ఎయిర్ బెంగళూరు-ముంబై మార్గంలో తన సర్వీసులను ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ విమానయాన సంస్థ బెంగళూరు-ముంబై మార్గంలో ప్రతిరోజూ రెండు విమానాలను నడుపుతుంది. కాగా.. బెంగళూరు-ముంబై మార్గంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ చివరి నాటికి వారానికి 150 విమానాలను (సర్వీసులను) నడపాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. అలాగే.. సెప్టెంబర్ 10 నుండి బెంగళూరు నుండి చెన్నైని కలుపుతూ కొత్త మార్గాన్ని తన సేవలను ప్రవేశపెడబోతుంది.
కంపెనీ ప్రకారం.. సెప్టెంబర్ చివరి నాటికి వారానికి ( ప్రస్తుతం ఉన్న ఆరు రూట్లల్లో) 150 విమానాలను నడపాలని భావిస్తుంది. ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, బెంగళూరు, చెన్నై నగరాల్లోని రూట్లల్లో ఆకాసా తన విమానాలను సర్వీసులను ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీకి మూడు విమానాలు ఉన్నాయి. వాటిలో మూడవది ఆగస్టు 16న అందుకుంది. ఇది ప్రతి రెండు వారాలకు ఒక కొత్త విమానాన్ని జోడించాలని యోచిస్తోంది. మార్చి 2023 చివరి నాటికి 18 విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తుంది. తదుపరి నాలుగు సంవత్సరాలలో ఎయిర్లైన్ 54 అదనపు విమానాలను కొనుగోలు చేయాలని, దీంతో మొత్తం విమానాల పరిమాణాన్ని 72 కు తీసుకెళ్లాలని భావిస్తోంది.
ఈ సందర్భంగా ఆకాసా ఎయిర్లైన్ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ.. క్యారియర్ బాగా క్యాపిటలైజ్ చేయబడిందని, మరిన్ని విమానాల కోసం ఆర్డర్ చేయడానికి సిద్దంగా ఉన్నాం, ఆర్థిక మార్గాలతో దాని వృద్ధిని సాధించిందని చెప్పారు. జున్ఝున్వాలాకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఆయనకు మేము ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం, ఆకాసా ఎయిర్ వచ్చే ఐదేళ్లలో 72 విమానాలను చేర్చడానికి ఆర్థిక స్తోమతతో మంచి క్యాపిటలైజ్డ్ ఎయిర్లైన్గా ఉంది. రాబోయే 18 నెలల్లో ఎయిర్క్రాఫ్ట్ను కూడా ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆగస్ట్ 17న ఆకాసా ఎయిర్ యొక్క ప్రధాన పెట్టుబడిదారు రాకేష్ జున్జున్వాలా మరణించిన విషయం తెలిసిందే..