Asianet News TeluguAsianet News Telugu

మురికి కుంటలో వివాహ వార్షికోత్సవం.. బ్యాండ్ లు కొడుతూ డ్యాన్స్ చేసిన స్థానికులు..ఎందుకంటే ?

ఓ జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని మురికి కుంటల మధ్య, చెత్తా చెదారం పోగై ఉన్న ప్రాంతంలో జరుపుకుంది. ఈ విచిత్ర ఘటన యూపీలోని ఆగ్రాలో జరిగింది. (Agra couple celebrates their wedding anniversary in a dirty pond) దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Agra couple celebrates their wedding anniversary in a dirty pond ?..ISR
Author
First Published Feb 6, 2024, 1:38 PM IST

సాధారణంగా వివాహ వార్షికోత్సవాన్ని ఆహ్లాదకరైమన ప్రదేశంలో జరపుకుంటారు. కుదిరిన వాళ్లు విదేశాల్లోనో, లేకపోతే భారత్ లోని లక్షద్వీప్, గోవా వంటి ప్రాంతంల్లో జరుపుకుంటారు. మధ్యతరగతి ప్రజలైతే ఇంట్లోనే సాదాసీదాగా చేసుకుంటారు. కానీ ఓ జంట మాత్రం వివాహ వార్షికోత్సవాన్ని మురికి కుంట దగ్గర, చెత్తా చెదారం పోగైన ప్రాంతంలో జరుపుకుంది. స్థానికులు కూడా బ్యాండ్ లు వాయిస్తూ, డ్యాన్సులు చేశారు. 

మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ..

ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా నగరంలోని నాగలా కాళీ ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా మారడం, ఎన్ని సార్లు చెప్పినా అధికారులు, నాయకులు పట్టించుకోపోవడంతో భగవాన్ శర్మ, ఉమాశర్మ దంపతులు ఈ వినూత్న పనికి పూనుకున్నారు. చాలా కాలం నుంచి ఈ సమస్య ఎదురువుతుండటంతో ఆ జంట తమ 17వ పెళ్లి రోజును డ్రైనేజీ, చెత్తా చెదారం పోగైన ప్రాంతంలో జరుపుకుంది. 

15 ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతోందని, అయితే గత ఎనిమిది నెలలుగా రోడ్డు మురికి కాలువగా మారిందని స్థానికులు వాపోయారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, డ్రైనేజీ సక్రమంగా నిర్మించకపోతే ఓటు వేయబోమని నిరసన తెలిపారు.

హైస్పీడ్ ఏరియల్ టార్గెట్ ‘అభ్యాస్’ ప్రయోగం సక్సెస్.. దీంతో ఉపయోగాలు ఏంటంటే ?

వాస్తవానికి నాగలా కాళీ ప్రాంతంలో ఉన్న ఈ రోడ్డును 30కి పైగా కాలనీల ప్రజలు ఉపయోగిస్తున్నారు. కానీ చాలా కాలంగా ఈ రోడ్డు మురికి కుంటలా మారింది. అక్కడ అపరిశుభ్రం రాజ్యమేలుతుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు 2 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించి తమ గమ్య స్థానాలకు చేరుతున్నారు. ఇక్కడ 10 నుండి 12000 మధ్య జనాభా జీవిస్తున్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బేబీ రాణి మౌర్య మంత్రిగా కూడా ఉండటం గమనార్హం. 

కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలోని చాలా కాలనీల ప్రజలు తమ ఇంటి ముందు పోస్టర్లను అంటించారు. అందులో ‘డెవలప్ మెంట్ లేదు కాబట్టి.. ఓటు కూడా లేదు’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో పలుమార్లు ప్రజా ప్రతినిధులను కలిసి విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  దీంతో విసుగు చెందిన భగవాన్ శర్మ తన భార్య ఉమాశర్మతో కలిసి ఈ వినూత్న నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios