బీజేపీ ఉగ్రవాదాన్ని అంతం చేసి, త్రిపురలో సర్వతోముఖాభివృద్ధిని తీసుకొచ్చింది: అమిత్ షా
Agartala: త్రిపుర పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. "ఎన్ఎల్ఎఫ్టీ (నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర)తో శాంతి చర్చల ద్వారా ఉగ్రవాదాన్ని అంతమొందించామనీ, రాష్ట్రంలో అంతర్గతంగా నిర్వాసితులైన బ్రూస్లకు పునరావాసం కల్పించామని" చెప్పారు. బీజేపీ ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధిని తీసుకొచ్చిందని కూడా పేర్కొన్నారు.
Union home minister Amit Shah: త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించి ఈశాన్య రాష్ట్రానికి సర్వతోముఖాభివృద్ధిని తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలు చూపించిన అపారమైన ప్రేమ, విశ్వాసం త్రిపురలో బిజెపి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టంగా సూచిస్తుందని షా అన్నారు. అలాగే, ఎన్ఎల్ఎఫ్టీ (నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర)తో శాంతి చర్చల ద్వారా ఉగ్రవాదాన్ని అంతమొందించామనీ, రాష్ట్రంలో అంతర్గతంగా నిర్వాసితులైన బ్రూస్లకు పునరావాసం కల్పించామని ఆయన చెప్పారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ విజయాలను హైలైట్ చేసే లక్ష్యంతో రెండు బీజేపీ రథయాత్రలను జెండా ఊపి ప్రారంభించడానికి అమిత్ షా త్రిపుర పర్యటనకు వచ్చారు. జన విశ్వాస్ ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ వామపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. త్రిపురలో హింసను బీజేపీ అంతం చేసిందని, మరణాలను కూడా ముగించిందని ఆయన అన్నారు. ఒకప్పుడు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హింస, భారీ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పేరుగాంచిన త్రిపుర ఇప్పుడు అభివృద్ధి, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, క్రీడల్లో విజయాలు, పెరుగుతున్న పెట్టుబడులు, సేంద్రియ వ్యవసాయ కార్యకలాపాలకు ప్రసిద్ది చెందిందని షా అన్నారు.
ఉత్తర త్రిపురలో అమిత్ షా ప్రసంగిస్తూ, రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు రాష్ట్రాన్ని కమ్యూనిస్టుల నుండి విముక్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని నొక్కి చెప్పారు. త్రిపుర సర్వతోముఖాభివృద్ధి కోసమే 'జన విశ్వాస్ యాత్ర' చేపట్టినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట్రాన్ని పరిశ్రమలకు అనుగుణంగా మార్చాలనే లక్ష్యంతో మేము ఈ మార్చ్ నిర్వహిస్తున్నాము. రాష్ట్రాన్ని అధునాతన త్రిపుర, ఉత్తమ త్రిపుర-సంపన్న త్రిపుర (ఉన్నత్ త్రిపుర, శ్రేష్ఠ త్రిపుర, సమృద్ధి త్రిపుర) గా ప్రజలు తెలుసుకోవాలి అని అన్నారు. '2023 ఎన్నికలు త్రిపురను కమ్యూనిస్టుల నుంచి విముక్తం చేయడమే. గతంలో ఒక నిర్దిష్ట కేడర్ ఉండేది, వారి అనుమతి ప్రతి రోజువారీ పని చేయడానికి అవసరం, కానీ ఇప్పుడు మీరు ఇక్కడ కమ్యూనిస్ట్ ను చూడలేరు" అని ఆయన అన్నారు.
రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా, ప్రభుత్వం పని ఆధారంగా మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటుంది కాబట్టి యాత్ర పేరును సరిగ్గా ఉంచినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 60 నియోజకవర్గాల్లో 8 రోజుల పాటు 1,000 కిలో మీటర్ల పాదయాత్ర, 200కు పైగా బహిరంగ సభలు, 100కు పైగా పాదయాత్రలు, 50 రోడ్ షోలు నిర్వహించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎలా నిలబడ్డారో పార్టీ చూపిస్తుందని ఆయన అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో రైల్వే, ఇంటర్నెట్, హైవేస్, ఎయిర్ వేస్ వంటి నాలుగు హామీలను నెరవేర్చామని చెప్పారు.