Asianet News TeluguAsianet News Telugu

13 ఏళ్ల అక్క ప్రియుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన చెల్లి.. తల్లిదండ్రులకు ఎక్కడ చెబుతుందో అని ఏం చేసిందంటే

ఓ అక్క తన చెల్లెలు పట్ల దారుణంగా ప్రవర్తించింది. తన ప్రియుడితో కలిసి ఆమెను హతమార్చింది. తరువాత డెడ్ బాడీని పడేసి, తనకేమీ తెలియదన్నట్టు ప్రవర్తించింది. కానీ ఈ విషయం పోలీసులకు తెలియడంతో విచారణ ప్రారంభించారు. ఆ విచారణలో అక్కే ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలిసింది.

A 13-year-old girl was brutally murdered by her sister who saw her being intimate with her boyfriend..ISR
Author
First Published May 26, 2023, 8:23 AM IST

13 ఏళ్ల బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉండగా 9 ఏళ్ల చెల్లెలు చూసింది. ఈ విషయాన్ని ఎక్కడ తల్లిదండ్రులకు చెబుతుందేమో అనే భయంతో ఆ బాలిక చెల్లెలు పట్ల దారుణంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి చెల్లిని క్రూరంగా హతమార్చింది. అనంతరం ఏమీ తెలియనట్టు నటించింది. కానీ పోలీసులు దర్యాప్తులో ఆమె నేరం అంగీకరించింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

కర్ణాటక కేబినెట్ విస్తరణ.. సిద్దరామయ్య మంత్రివర్గంలోకి 24 మంది..? రేపే ప్రమాణ స్వీకారం..

వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ లోని వైశాలి జిల్లాలోని జందాహా బ్లాక్ లో తల్లిదండ్రులు 13 ఏళ్లు, 9 ఏళ్ల వయస్సున్న తమ కూతుర్లతో కలిసి జీవిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఇటీవల ఓ పెళ్లి వేడుక కోసం వేరే గ్రామానికి వెళ్లారు. అక్కడే నాలుగైదు రోజులు ఉన్నారు. ఈ క్రమంలో 13 ఏళ్ల బాలిక తన ప్రియుడితో ఇంటి వద్ద సన్నిహితంగా మెలిగింది. దీనిని చెల్లెలు చూసింది. దీంతో అక్క, ఆమె ప్రియుడు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. 

ప్రేమ పేరుతో కూతురు వెంటపడుతున్నాడని బాలుడి హతమార్చిన తండ్రి.. ఎక్కడంటే ?

అయితే బాలిక ఈ విషయం ఎక్కడ తన తల్లిదండ్రులకు, ఇరుగుపొరుగు వారికి చెప్పేస్తుందో అనే భయంతో అక్క, ఆమె ప్రియుడు కలిసి ఆ బాలికను చంపేశారు. అనంతరం డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచారు. అయితే రెండు, మూడు రోజుల తరువాత మృతదేహం కుళ్లిపోయి, దుర్వాసన రావడం మొదలయ్యింది. దీంతో ఆ మృతదేహాన్ని నరికి యాసిడ్ పోసి ఇంటి పెరట్లో పడేశారు. నాలుగైదు రోజుల తరువాత తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నారు. అయితే వారికి చిన్న కూతురు కనిపించలేదు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో కొందరు గ్రామస్తులు మృతదేహాలను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని అవశేషాలను సేకరించారు. వారి దర్యాప్తులో ఆ డెడ్ బాడీ తప్పిపోయిన బాలికదిగా గుర్తించారు. అనంతరం ఆధారాలను ల్యాబ్ కు పంపించి శవపరీక్ష కూడా నిర్వహించారు.

మళ్లీ ఒక సారి ఆలోచించండి..పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనండి: ప్రతిపక్షాలకు నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి

పోలీసులు దర్యాప్తులో భాగంగా బాధితురాలి అక్కను ప్రశ్నించారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించి మొత్తం సంఘటనలను బయటపెట్టింది. ఈ ఘటనపై వైశాలి ఎస్పీ రవి రంజన్ కుమార్ మాట్లాడుతూ.. మే 16న తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైందని, మే 19న ఆమె అవశేషాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో తగిన సాక్ష్యాధారాలు లభించడంతో మంగళవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios