Asianet News TeluguAsianet News Telugu

తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారం : నిందితులను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ఢిల్లీ కోర్టు

అదనపు సెషన్స్ జడ్జి అశుతోష్ కుమార్ నిందితులను పోలీసులకు అప్పగించారు, ఈ కేసులో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం అని భావించామని తెలిపారు. జ్యుడీషియల్ కస్టడీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను  కోర్టు ముందు హాజరుపరిచారు.

9-yr-old girl's rape and murder: Delhi court sends four people to police custody
Author
Hyderabad, First Published Aug 10, 2021, 9:21 AM IST

న్యూఢిల్లీ : ఢిల్లీ కంటోన్మెంట్ సమీపంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన కాటికాపరి, మరో ముగ్గురుని ఢిల్లీ కోర్టు సోమవారం మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఈ ఘటన ఈ నెల మొదట్లో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

అదనపు సెషన్స్ జడ్జి అశుతోష్ కుమార్ నిందితులను పోలీసులకు అప్పగించారు, ఈ కేసులో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం అని భావించామని తెలిపారు. జ్యుడీషియల్ కస్టడీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను  కోర్టు ముందు హాజరుపరిచారు.

నలుగురు నిందితులు రాధే శ్యామ్ (55) కాటి కాపరిగా గుర్తించారు. ముగ్గురు ఉద్యోగులు - సలీం, లక్ష్మీ నారాయణ్, కుల్దీప్ - వీరంతా అమ్మాయి తల్లికి తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు.

కోర్టుకు సమర్పించిన అప్లికేషన్ లో ఢిల్లీ పోలీసుల సాక్షులు, సాక్ష్యాలను సమర్పించేముందు వీరిని 5 రోజుల రిమాండ్‌ కు ఇవ్వాల్సిందిగా కోరింది. ప్రాసిక్యూషన్ ప్రకారం, మైనర్ బాలికపై అత్యాచారం, హత్య... తరువాత ఆమె తల్లిదండ్రుల అనుమతి లేకుండా దహనం చేశారు. ఈ కేసు ఇటీవల క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యింది.

మృతురాలి తల్లి స్టేట్మెంట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు, ఆగస్టు 1 న తన కుమార్తెపై  అత్యాచారం, హత్య చేసి... కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా దహనం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది.

అమానుషం : శ్మశానంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కాల్చి...

నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య), 376 (అత్యాచారం) మరియు 506 (క్రిమినల్ బెదిరింపు), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో), ఎస్సీ/ST చట్టం కింద కేసు నమోదు చేశారు. 

కాగా, ఈ నెల మొదట్లో దేశ రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని బలవంతంగా కాల్చేశారు. ఈ కేసులో ఓ పూజారితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు ఆ నిరసన చేపట్టారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఆ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని పురానా నంగల్‌ శ్మశానవాటికకు సమీపంలో నివసిస్తోంది.

స్మశానంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై హత్యాచారం : న్యాయం జరిగేవరకు అండగా ఉంటాం.. రాహుల్ గాంధీ

నిన్న సాయంత్రం శ్మశానవాటిక లోని కూలర్ నుంచి మంచినీళ్లు తీసుకురావడానికి శ్మశానవాటికకు వెళ్లింది.. కానీ తిరిగి రాలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో, శ్మశానవాటిక పూజారి రాధేశ్యామ్ కు తెలిసిన కొందరు స్థానికులు.. చిన్నారి తల్లిని శ్మశానవాటికకు పిలిచారు. అక్కడ ఆ చిన్నారి మృతదేహాన్ని చూపించారు.

ఆ చిన్నారి కూలర్ నీళ్లు తాగుతుండగా కరెంట్ షాక్ కొట్టిందని వాళ్లు తల్లికి చెప్పారు. అయితే చిన్నారి మణికట్టు, మోచేయిపై కాలిన గుర్తులు ఉన్నాయి. ఆమె పెదవులు కూడా నీలం రంగులో ఉన్నాయని ఆమె తల్లి చెబుతోంది.

పూజారి, అతని సహచరులు ఈ విషయం మీద పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని బాలిక తల్లికి చెప్పారు. కేసు నమోదు చేస్తే పోస్ట్‌మార్టం పేరుతో పిల్లల అవయవాలు చోరీ చేస్తారని వారు ఆమె తల్లిని భయపెట్టారు. అంతేకాదు వెంటనే అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు.

దీనికి తల్లి ఒప్పుకోవడంతో వారు విజయం సాధించారు. అయితే తల్లికి కొంత  డబ్బులు కూడా ఇచ్చి ఉంటారని స్థానికంగా ఊహాగానాలు వెలువడ్డాయి. అనుమానం వచ్చిన తల్లి.. తన భర్తతో కలిసి ఈ ఘటన మీద యుద్ధానికి తెరలేపింది. పాత నంగల్ గ్రామానికి చెందిన సుమారు 200 మంది  శ్మశానవాటిక వద్ద గుమిగూడారు. పోలీసులకు సమాచారం అందించారు.

నైట్ వెస్ట్ జిల్లా పోలీసు సీనియర్ అధికారి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తమకు ఈ కేసు గురించి కాల్ వచ్చిందని చెప్పారు. నిందితుల మీద పిల్లల లైంగిక వేధింపులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలపై నేరాలపై కఠినమైన చట్టాల కింద అభియోగాలు నమోదు చేయబడ్డాయని తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios