విదేశీ జైళ్లలో ఎంత మంది భారతీయులు ఉన్నారు? పార్లమెంటులో కేంద్రం ఏం చెప్పిందంటే..
ప్రపంచవ్యాప్తంగా వివిధ జైళ్లలో అండర్ ట్రయల్ సహా 8,343 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)తెలిపింది. అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో 1,926 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని వెల్లడించింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ: ప్రపంచవ్యాప్తంగా వివిధ జైళ్లలో అండర్ ట్రయల్ సహా 8,343 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం లోక్సభకు తెలిపింది. విదేశీ జైళ్లలో ఉన్న ఖైదీలతో సహా విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత మరియు శ్రేయస్సుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ లోక్సభకు తెలిపారు.
UAEలో 1,926 మంది ఖైదీలు
ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి వి మురళీధరన్ ఈ వివరాలు వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో అత్యధికంగా 1,926 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని, సౌదీ అరేబియాలో 1,362 మంది, నేపాల్లో 1,222 మంది ఖైదీలు ఉన్నారని లోక్సభలో మురళీధరన్ తెలియజేశారు. మంత్రి వి మురళీధరన్ మాట్లాడుతూ.. మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, విదేశీ జైళ్లలో అండర్ ట్రయల్తో సహా భారతీయ ఖైదీల సంఖ్య 8,343. శిక్ష పడిన వ్యక్తుల బదిలీ (టీఎస్పీ) ఒప్పందాలపై 31 దేశాలతో భారత్ సంతకాలు చేసిందని ఆయన చెప్పారు.
విదేశాల్లోని భారతీయ మిషన్లు స్థానిక చట్టాలను ఉల్లంఘించినందుకు భారతీయ పౌరులు జైలుకు వెళ్లే సంఘటనలపై నిశితంగా గమనిస్తున్నాయని మురళీధరన్ చెప్పారు. శిక్ష పడిన వ్యక్తుల బదిలీ (టీఎస్పీ) ఒప్పందాలపై 31 దేశాలతో భారత్ సంతకాలు చేసిందని ఆయన చెప్పారు.