మధ్యప్రదేశ్ లో బస్సు బోల్తా... ఆరుగురు మృతి
ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బుధవారం అర్థరాత్రి రైసేన్ లోని నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు.
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బుధవారం అర్థరాత్రి రైసేన్ లోని నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.