Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్ లో బస్సు బోల్తా... ఆరుగురు మృతి

ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బుధవారం అర్థరాత్రి రైసేన్ లోని నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు.

6 killed, over 19 injured after bus falls into canal in Madhya Pradesh
Author
Hyderabad, First Published Oct 3, 2019, 8:56 AM IST


మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బుధవారం అర్థరాత్రి రైసేన్ లోని నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios