5జీ వల్ల విద్యా రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది - కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
5జీ వల్ల దేశంలోని విద్యా రంగానికి విస్తృత ప్రయోజనాలు చేకూరనున్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) 22వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దేశంలో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందే రంగాల్లో విద్య కూడా ఒకటని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 5జీ టెలికాం సేవలను ప్రారంభించడం విద్యా మంత్రిత్వ శాఖ తలపెట్టిన ‘డిజిటల్ యూనివర్శిటీ’ అమలుకు సహాయపడుతుందని ఆయన అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) 22వ స్నాతకోత్సవం సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగించారు. దేశంలో 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించిన నేపథ్యంలో.. దానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘5జీ వల్ల విద్యా రంగానికి లాభం కలుగుతుంది. ఎందుకంటే మనం డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ప్లాన్ చేస్తున్నాం. మనం వర్చువల్ ల్యాబ్ ల కోసం ప్రయత్నిస్తున్నాం. మనం క్వాలిటీ కంటెంట్, ప్రెజంటబుల్ కంటెంట్ ను అభివృద్ధి చేస్తుంటే వాటిని దేశం ప్రతీ మూలకు ఎలా పంపుతాము? అయితే ఈ 5జీ సేవల వల్ల ఆ కంటెంట్ ప్రతీ మూలకు చేరుతుంది. ఈ టెక్నాలజీ ఒక వాహనంగా ఉపయోగపడుతుంది. ’’ అని అన్నారు.
Vande Matram: హలో కాదు గురు.. ఇప్పుడు కాల్ వస్తే వందేమాతరం అనాలి !
5జీ సేవల ప్రారంభంతో భారత్ ‘‘ప్రీమియర్ లీగ్ ’’ లో చేరుతోందని, దీని వల్ల సామాన్య ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారని ప్రధాన్ అన్నారు. డిజిటల్ ఎకానమీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇతర రంగాలు 5జీ ప్రయోజనాన్ని పొందుతాయని అన్నారు. ‘‘ కొత్త 5జీ నెట్ వర్క్ మొత్తం దృష్టాంతంలో సముద్ర-మార్పును సృష్టించబోతోంది. ఈ 5జీ రోల్ అవుట్ వల్ల పేదవాడు ప్రధాన లబ్ధిదారుగా ఉంటారు ’’ అని ఆయన అన్నారు.
భారతదేశం ఒక ప్రముఖ ఆర్థిక సూపర్ పవర్ గా ఎదగడానికి, సమాజం విద్య ద్వారా తనను తాను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం కేంద్ర విద్యా శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. 5జీ సేవలను ప్రారంభించడం పై ప్రస్తావిస్తూ.. భారత దేశం త్వరలోనే ఒక ఆర్థిక అగ్రశక్తిగా మారడంతో పాటు ఒక టెక్న ల్ సూపర్ పవర్ గా అవతరిస్తుందని అన్నారు. దేశం ఒక ఆర్థిక అగ్రరాజ్యంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తోందని, సృజనాత్మకత, వ్యవస్థాపకత దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయని చెప్పారు.
సైన్స్ తో బలమైన సంబంధాలున్న భారత్ చాలా పురాతన నాగరికత కలిగి ఉందని, కోవిడ్-19 మహమ్మారి.. భారతీయ జ్ఞాన వ్యవస్థలు, భారతీయ జీవన విధానం ప్రపంచానికి అందించడానికి చాలా ఉందని నిరూపించిందని తెలిపారు. ఆధునికత నేపథ్యంతో భారతీయ విజ్ఞాన వ్యవస్థలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పులపై పోరాడటంలో, శాంతి, సామరస్యాలకు మార్గం సుగమం చేయడంలో, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక నమూనాలను అందించడంలో భారతదేశం ప్రపంచానికి గీటురాయిగా నిలుస్తుందని ప్రధాన్ అన్నారు.
ఆరెంజ్ ఫ్రూట్ బాక్స్ల్లో రూ. రూ.1,476 కోట్లు విలువ చేసే డ్రగ్స్.. ఎలా చిక్కాయంటే..?
ఈ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, యూఓహెచ్ ఛాన్సలర్ జస్టిస్ ఎల్ఎన్ రెడ్డి, వైస్ చాన్సలర్ బీజే రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన్, ఇతర ప్రముఖులు విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్లను సమర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ)ని సందర్శించారు. అక్కడ ఏఏస్సీఐ, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ‘‘ ఈ ఎంవోయూ అభ్యసన, అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, చురుకైన, ప్రతిస్పందించే, భవిష్యత్ సివిల్ సర్వెంట్లను సృష్టించడానికి మార్గం సుగమం చేస్తుంది ’’ అని ఆయన ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఎఎస్ సీఐ విద్యార్థులను కూడా ఆయన కలుసుకున్నారు.
ఇదిలా ఉండగా శనివారం ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2022 సదస్సులో ఆయన ఎంపిక చేసిన నగరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించారు. ఈ 5జీ సేవలు రాబోయే రెండు సంవత్సరాల్లో దేశం మొత్తానికి అందుబాటులోకి రానున్నాయి.