Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు.. ముగ్గురు తీవ్రవాదులు హతం..

షోపియాన్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సమయంలో ఈ ముగ్గురు మరణించారు. ముందుగా వారిని లొంగిపోవాలని కోరామని, కానీ వారు దానికి నిరాకరించారని పోలీసులు చెప్పారు. ఈ ముగ్గురు కూడా లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులని పోలీసులు భావిస్తున్నారు. పౌరుల హత్య వెనుక  Lashkar-e-Taiba ఉందని అధికారులు భావిస్తున్నారు.

3 Terrorists Shot Dead In J&K, One Was Involved In Civilian's Killing
Author
Hyderabad, First Published Oct 12, 2021, 10:47 AM IST

శ్రీనగర్ : గత వారం జమ్మూకాశ్మీర్ లో ఒక పౌరుడిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన terrorists ఘటనలో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు. సోమవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో.. ఉగ్రవాద వ్యతిరేక చర్యలో భాగంగా జరిగిన కాప్పుల్లో వారు చనిపోయారని పోలీసులు తెలిపారు.

షోపియాన్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సమయంలో ఈ ముగ్గురు మరణించారు. ముందుగా వారిని లొంగిపోవాలని కోరామని, కానీ వారు దానికి నిరాకరించారని పోలీసులు చెప్పారు. ఈ ముగ్గురు కూడా లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులని పోలీసులు భావిస్తున్నారు. పౌరుల హత్య వెనుక  Lashkar-e-Taiba ఉందని అధికారులు భావిస్తున్నారు.

"... లెట్ (టిఆర్ఎఫ్) కు చెందిన 03 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని గుర్తించామని, వీరినుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా నేరపూరిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిమీద పరిశోధన కొనసాగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని పోలీసులు తెలిపారు.

చనిపోయిన ముగ్గురులో ఒకరు - గందర్‌బల్ జిల్లాకు చెందిన ముఖ్‌తార్ షా - శ్రీనగర్‌లో స్ట్రీట్ ఫుడ్ హాకర్‌గా జీవనం సాగించిన బీహార్‌కు చెందిన వీరేంద్ర పాశ్వాన్ ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు. పోలీసులు నిన్న మరో ఉగ్రవాది - ఇంతియాజ్ అహ్మద్ దార్ - బండిపూర్‌లోని హజిన్ ప్రాంతంలో కాల్చి చంపబడ్డారని, అతని నలుగురు సహచరులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

గత మంగళవారం వీరేంద్ర పాశ్వాన్‌తో సహా మరో ముగ్గురు పౌరులలో బండిపూర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ మహ్మద్ షఫీ లోన్ హత్యకు దార్ కారణమని పోలీసులు తెలిపారు. మూడవ బాధితుడు మఖన్ లాల్ బింద్రూ (70), కాశ్మీరీ పండిట్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖుడు, శ్రీనగర్ ఇక్బాల్ పార్క్‌లో ఫార్మసీ యజమాని.

48 గంటల లోపే మరో ఇద్దరు పౌరులు - దీపక్ చంద్, సుపుందర్ కౌర్ - మరణించారు. ఇద్దరూ శ్రీనగర్ ఈద్గా ప్రాంతంలోని ప్రభుత్వ బాలుర హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయులు. హత్యలకు ప్రతిస్పందనగా ఆదివారం భద్రతా దళాలు 700 మందిని అదుపులోకి తీసుకున్నాయి.

అరెస్టయిన వారిలో చాలామందికి నిషేధిత జమాతే-ఇ-ఇస్లామికి సంబంధాలున్నాయని లేదా భూగర్భ కార్మికులు (OGW) అని అనుమానించబడ్డారని, శ్రీనగర్, బుద్గామ్ లేదా దక్షిణ కాశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల నుండి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కశ్మీర్‌లో ఐదుగురు జవాన్ల వీరమరణం.. ఉగ్రవాదులతో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న కాశ్మీర్ లోయలో ఈ హత్యలు ఆగ్రహాన్ని రేకెత్తించాయి, దాడులను ఆపలేకపోవడం.. పరిపాలనలో అసమర్థత అని, ఈ దాడులతో స్థానికులు భయంతో జీవిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా విమర్శించారు.

గురువారం, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ అమాయక ప్రజలు చనిపోతున్నారని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోయను సందర్శించి, అక్కడ నివసిస్తున్న వారికి భరోసా అందించాలని కూడా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పిలుపునిచ్చారు. కార్యకలాపాల పర్యవేక్షణ కోసం హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారుల బృందాన్ని కశ్మీర్‌కు పంపింది. అమిత్ షా సమావేశం నిర్వహించి, స్థానిక అధికారులను నిలదీసిన తర్వాత ఇది జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios