ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్లోని గెలాక్సీ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్లోని గెలాక్సీ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా ఘటన స్థలంలో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలంలో మంటలను ఆర్పేందుకు, భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Add Asianetnews Telugu as a Preferred Source

ఈ ప్రమాదం నేపథ్యంలో ఎనిమిది మందిని అక్కడి నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
