Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరప్రదేశ్ లో షాకింగ్.. సూట్ కేసులో యువతి మృతదేహం.. !!

మథురలో ఓ 25యేళ్ల యువతి మృతదేహం సూట్ కేస్ లో కుక్కి లభించింది. అది చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. 

25 years old woman body found inside suitcase in Mathura, UP
Author
First Published Nov 19, 2022, 8:23 AM IST

ఉత్తర ప్రదేశ్ : యూపీలోని మధురలో సూట్కేసులో కనిపించిన 25 ఏళ్ల యువతి మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.  

ఇదిలా ఉండగా, శ్రద్ధావాకర్ హత్య కేసు మురకవముందే దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో షాకింగ్  ఘటన తాజాగా జరిగింది. ప్రియురాలిపై అనుమానంతో సహజీవనం చేస్తున్న ప్రియుడు ఆమెను చంపిన ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని మదన్ పూర్ ఖాదర్ ప్రాంతంలో వెలుగు చూసింది. గురువారం నాడు 30 ఏళ్ల ఓ వ్యక్తి తన ప్రియురాలు తనకు నమ్మకద్రోహం చేసిందనే అనుమానంతో చంపేశాడు. నిందితుడిని ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రాహుల్‌గా గుర్తించారు. మృతురాలు రాహుల్  22 ఏళ్ల స్నేహితురాలు గుల్షానాగా గుర్తించారు. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే కారణంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.

కదులుతున్న కారులో మోడల్ పై గ్యాంగ్ రేప్, మహిళతో సహా నలుగురి అరెస్ట్..

గత శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో ఒక మహిళ తాళం వేసిఉన్న ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉందని పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె మరణించినట్లు గుర్తించారు. తరువాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుల్షానా తన భర్త నుంచి విడిపోయి ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి ఉంటోది. శవపరీక్ష నివేదికలో ఆమె గొంతు నులిమి చంపినట్లు ధృవీకరించబడింది. సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో, గుల్షానా మృతదేహం లభించిన గది యజమాని గత 20-22 రోజులుగా రాహుల్ అనే వ్యక్తి అక్కడ ఉంటున్నాడని పోలీసులకు చెప్పాడు. ఆ శుక్రవారం రాహుల్ నుంచి తనకు కాల్ వచ్చిందని, తన స్నేహితురాలు మూర్ఛ వ్యాధితో బాధపడుతూ తన గదిలో స్పృహతప్పి పడిపోయిందని, ఆ సమయంలో తాను గదిలో లేడని చెప్పాడు. దీంతో రాహుల్ మొబైల్ నంబర్‌పై నిఘా ఉంచామని, బుధవారం ఇక్కడి ఆలీ జంగిల్ ప్రాంతంలో అతడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు.

విచారణ సందర్భంగా, గుల్షానా తన బిడ్డతో పాటు అప్పుడప్పుడు తన గదికి వచ్చేదని రాహుల్ పోలీసులకు చెప్పాడు. రాహుల్ కూడా ఆ మహిళను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, అయితే ఆమె ఆది అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించానని చెప్పాడు. ఈ విషయమే గత గురువారం, రాహుల్, గుల్షానా మధ్య గొడవ జరిగింది, ఆ తర్వాత అతను తన శాలువాతో ఆమె గొంతు నులిమి చంపి, ఆమె బిడ్డను తనతో తీసుకొని పారిపోయాడు. చిన్నారిని రక్షించి గుల్షానా తల్లికి అప్పగించినట్లు పోలీసు అధికారి తెలిపారు.

అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే 28 ఏళ్ల యువకుడు తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి చంపిన అలాంటి మరొక సంఘటనకు ఈ హత్య వెలుగులోకి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios