కుప్పకూలిన పైకప్పు: శిదిలాల కింద 25 మంది
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షోలాపూర్ బ్రాంచ్ పై కప్పు బుధవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కిందే 25 మంది చిక్కుకొన్నారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షోలాపూర్ బ్రాంచ్ భవనం పై కప్పు బుధవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 30 మంది చిక్కుకొన్నారు. ఈ ఘటనలో 8మందిని స్థానికులు రక్షించారు.
షోలాపూర్ లోని స్టేట్ హైవేలోని కమలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ గ్రామం సోలాపూర్ కు 150 కి.మీ దూరంలో ఉంది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొన్నారు.
ఈ సీజన్ లో మహారాష్ట్రంలో భవనం కూలిన ఘటన ఇది రెండోది. డోంగ్రీలో భవనం కుప్పకూలిన ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఈ నెల 17వ తేదీన చోటుచేసుకొంది.
డోంగ్రీ ఘటన మరువక ముందే షోలాపూర్ లో బ్యాంకు పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 25 మంది చిక్కుకొన్నారు. శిధిలాల కింద చిక్కుకొన్న 25 మందిలో 8 మందిని రక్షించారు.