జమ్మూలో ఎన్కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టుల హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. వీరితో పాటు ఒక పౌరుడు, ఓ పోలీసు అధికారి మరణించారని భద్రతా దళాలు ప్రకటించాయి.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకొన్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి.
భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఘటనలో ఓ జవాన్ కూడ మృతి చెందారని అధికారులు ప్రకటించారు. జవాన్ తో పాటు మరో సామాన్యుడు కూడ మరణించారని సమాచారం.
ఇంటలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిపై దాడికి దిగారు. మృతిచెందిన ఉగ్రవాదులతో పాటు మరో ఉగ్రవాది కూడ ఇంట్లో తలదాచుకొన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.