Asianet News TeluguAsianet News Telugu

నాసిక్‌లోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇగత్‌పురి తహసీల్‌లోని ముండేగావ్‌లో ఉన్న ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇప్పటివరకు 2 మంది మరణించారని, 17 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.  

2 dead, 17 injured as massive fire breaks out in Nashik factory
Author
First Published Jan 1, 2023, 10:37 PM IST

ఈ ఏడాది తొలిరోజే మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్‌లోని ఒక ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది, ఇందులో చాలా మంది కార్మికులు చిక్కుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఫ్యాక్టరీలోని బాయిలర్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, దీంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు పలు అగ్నిమాపక యంత్రాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

గంటల తరబడి సహాయక చర్యలు 

మహారాష్ట్రలోని నాసిక్‌లోని నాసిక్-ముంబై హైవే వెంబడి ముంధేగావ్ గ్రామంలోని ఫ్యాక్టరీలో ఉదయం 11.30 గంటలకు బాయిలర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం చాలా భయానకంగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 11 మంది కూలీలను బయటకు తీశారు, అయితే.. ఇంకా చాలా మంది కూలీలు చిక్కుకుపోయి ఉంటారని భయాందోళన చెందుతున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే.. అగ్నిమాపక దళం, పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో మంటలను ఆర్పడంతో పాటు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన ముంధేగావ్ నాసిక్ నుండి 30 కి.మీ, ముంబైకి 130 కి.మీ దూరంలో ఉంది. 

బాయిలర్ పేలుడు కారణంగా పేలుడు సంభవించిన కర్మాగారం జిందాల్ కంపెనీకి చెందినది. ఈ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు 2 మంది మరణించారని, 17 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. గాయపడిన వారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పాటు జిల్లాకు చెందిన పలువురు పరిపాలన అధికారులు, పలువురు మంత్రులు సంఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పాలీ ఫిల్మ్ ఫ్యాక్టరీలో మంటలను ఆర్పేందుకు పలు బృందాలు రంగంలోకి దిగాయి.

సీఎం షిండే పరామర్శ

నాసిక్ ఫ్యాక్టరీ పేలుడులో గాయపడిన వారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం షిండే మాట్లాడుతూ.. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మరణించిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది.

భయాందోళనలో స్థానికులు

అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. వాస్తవానికి, పేలుడు చాలా అకస్మాత్తుగా జరిగింది, కార్మికులు ఏమీ అర్థం చేసుకోకముందే, మంటలు మొత్తం ఫ్యాక్టరీని చుట్టుముట్టాయి. కంపెనీలో పరిస్థితి విషమంగా ఉందని, అగ్నిప్రమాదం కారణంగా, అనేక వరుస పేలుళ్లు జరుగుతున్నాయని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios