Asianet News TeluguAsianet News Telugu

ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. అవి ఆత్మహత్యలు కాదు హత్యలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

మహారాష్ట్రలో కలకలం రేపిన ఒకే ఇంట్లో తొమ్మిదిమంది ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారిది ఆత్మహత్య కాదని.. గుప్తనిధుల కోసం విషం ఇచ్చి హత్య చేశారని తేలింది. 

2 Arrested For Allegedly Poisoning Of 9 To Death In Maharashtras Sangli
Author
Hyderabad, First Published Jun 29, 2022, 2:06 PM IST

ముంబయి :  మహారాష్ట్రలోని sangili జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తులో  షాకింగ్ విషయాలు  వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదని హత్యగా గుర్తించారు.

ఆత్మహత్య కాదు హత్య…
సాంగ్లీ జిల్లాలోని మైసల్​ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో మొత్తం తొమ్మిదిమంది ఉండేవారు. ఈనెల 20న కుటుంబంలోని 9 మంది ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మొదటగా అన్నదమ్ములకు అప్పులు ఎక్కువగా ఉండటంతో.. వాటిని తీర్చడం కష్టంగా భావించి వేరే దారిలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని  తేలింది. 

కానీ ఈ వ్యవహారంపై పోలీసులకు ఎక్కడో అనుమానం రావడంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. కుటుంబ సభ్యులది ఆత్మహత్య కాదని విషం ఇచ్చి వారిని చంపేశారని గుర్తించారు. గుప్తనిధుల కోసం ధీరజ్ చంద్రకాంత్, అబ్బాస్ మహమ్మద్ అలీ  అనే ఇద్దరు మాంత్రికులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరేదైనా కోణం కూడా దాగుందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మృతదేహాలు.. పోలీసులు ఏం చెబుతున్నారంటే?

ఇదిలా ఉండగా జూన్ 20న మహారాష్ట్రలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సాంగ్లీ జిల్లాలో ఓ ఇంట్లో ఏకంగా 9  మృతదేహాలు కనిపించాయి. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. దీంతో ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఆ యిల్లు స్మశానాన్ని తలపించింది.  తెల్లారేసరికి పరిస్థితులు  మొత్తం తలకిందులుగా కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఆ ఊరు ఊరంతా విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటన సాంగ్లి జిల్లాలోని మైసాల్ టౌన్ లో చోటు చేసుకుంది. 

సాంగ్లీ జిల్లాలోని మైసల్​ టౌన్ లో మాణిక్, పోపట్ ఎల్లప్ప వాన్ మోర్  అన్నదమ్ములు.  వీరిద్దరూ కలిసే ఉండేవాళ్ళు. మాణిక్ పెద్దోడు కాగా, పోపట్ ఎల్లప్ప వాన్ మోర్ చిన్నవాడు. సోదరులందరికీ వివాహాలు అయ్యాయి. ఆ సోదరుల కుటుంబాలకు కూడా కలిసి ఉంటుంది. అయితే ఈ రెండు కుటుంబాల సభ్యులు ఘటన రోజు ఆ ఇంట్లో విగతజీవులుగా కనిపించారు.  ఇందులో పెద్దవాడైన మాణిక్  వెటర్నరీ డాక్టర్ గా పని చేసేవాడు. ఈ కుటుంబం ప్రతిరోజు ఉదయం ఊర్లో నుంచి పాలు తెచ్చుకునేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ రోజు ఉదయం పాలు అమ్మేవారి దగ్గరికి ఈ కుటుంబం నుంచి ఎవరు వెళ్లలేదు. దీంతో ఆ పాలు అమ్మేవారి నుంచి ఓ అమ్మాయి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో 9 మంది మృతదేహాలు కనిపించాయి. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios