లక్నోలో ఘోరం.. భారీ వర్షం వల్ల గోడ కూలి 9 మంది మృతి.. ఒకరికి గాయాలు
లక్నోలో భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎడతెరిపి కురుస్తున్న వానల వల్ల ఓ భారీ గోడ కూలింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వీటి వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో కురిసిన భారీ వర్షం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు.
లక్నోలోని దిల్కుషా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా శుక్రవారం గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం వారు సహాయక చర్యలను చేపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకోని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.